Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
- పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాల్లో సంక్షోభం
- పొదుపు మంత్రం పాటించాలని పౌరులకు మోడీ పిలుపు
- పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగొచ్చని వదంతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. అన్ని రకాలుగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ప్రధాని మోడీ దేశ ప్రజలకు పొదుపు మంత్రం సూచించారు. పౌరులంతా పొదుపు పాటించాలని సూచించారు. ఈ నేపథ్యంలో చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరగవచ్చని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇక వాహనదారుల్లో భయాందోళనలు కూడా మొదలయ్యాయి. భారీగా పెరగవచ్చన్న వదంతులతో మరోసారి పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు పెరిగాయి.
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగొచ్చన్న వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అనేక నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కొందరు వినియోగదారులు ట్యాంకులు పూర్తిగా నింపించుకునేందుకు పోటీపడగా.. మరికొన్ని ప్రాంతాల్లో “నో ఫ్యూయల్”, “నో స్టాక్” బోర్డులు కూడా దర్శనమిచ్చాయి.
Also Read
- NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్లో టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం!
- Insurance Murder Case : రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో కలిసి భర్తని చంపింది.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు!
- US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
- Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఇంధన ధరలు లీటర్కు రూ.5 నుంచి రూ.20 వరకు పెరగొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చమురు మార్కెటింగ్ సంస్థలపై పెరుగుతున్న భారం, ప్రభుత్వ ఆర్థిక ఒత్తిడి, పెరుగుతున్న దిగుమతి బిల్లు కారణంగా త్వరలో ధరల పెంపు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్లోని అల్వార్లో అనేక పెట్రోల్ బంకుల దగ్గర “నో పెట్రోల్”, “నో డీజిల్” బోర్డులు కనిపించాయి. వినియోగదారులు పెట్రోల్ ధరలు రూ.5 నుంచి రూ.15 వరకు, డీజిల్ ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
భువనేశ్వర్లో మాత్రం పెట్రోల్ బంక్ యజమానులు ఇవన్నీ కేవలం పుకార్లేనని పేర్కొన్నారు. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇలాంటి వార్తలను నమ్మొద్దని సూచించారు. అయితే ధరలు పెరిగితే సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంగీకరించారు.
తాజావార్తలు
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
-
Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
-
Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?