Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
- పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాల్లో సంక్షోభం
- పొదుపు మంత్రం పాటించాలని పౌరులకు మోడీ పిలుపు
- పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగొచ్చని వదంతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. అన్ని రకాలుగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ప్రధాని మోడీ దేశ ప్రజలకు పొదుపు మంత్రం సూచించారు. పౌరులంతా పొదుపు పాటించాలని సూచించారు. ఈ నేపథ్యంలో చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరగవచ్చని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇక వాహనదారుల్లో భయాందోళనలు కూడా మొదలయ్యాయి. భారీగా పెరగవచ్చన్న వదంతులతో మరోసారి పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు పెరిగాయి.
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగొచ్చన్న వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అనేక నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కొందరు వినియోగదారులు ట్యాంకులు పూర్తిగా నింపించుకునేందుకు పోటీపడగా.. మరికొన్ని ప్రాంతాల్లో “నో ఫ్యూయల్”, “నో స్టాక్” బోర్డులు కూడా దర్శనమిచ్చాయి.
Also Read
- TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్గా అరూప్ రాయ్ ప్రకటన!
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
- RBI Bulletin: బలహీన రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు.. నిపుణుల హెచ్చరిక
ఇంధన ధరలు లీటర్కు రూ.5 నుంచి రూ.20 వరకు పెరగొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చమురు మార్కెటింగ్ సంస్థలపై పెరుగుతున్న భారం, ప్రభుత్వ ఆర్థిక ఒత్తిడి, పెరుగుతున్న దిగుమతి బిల్లు కారణంగా త్వరలో ధరల పెంపు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్లోని అల్వార్లో అనేక పెట్రోల్ బంకుల దగ్గర “నో పెట్రోల్”, “నో డీజిల్” బోర్డులు కనిపించాయి. వినియోగదారులు పెట్రోల్ ధరలు రూ.5 నుంచి రూ.15 వరకు, డీజిల్ ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
భువనేశ్వర్లో మాత్రం పెట్రోల్ బంక్ యజమానులు ఇవన్నీ కేవలం పుకార్లేనని పేర్కొన్నారు. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇలాంటి వార్తలను నమ్మొద్దని సూచించారు. అయితే ధరలు పెరిగితే సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంగీకరించారు.
తాజావార్తలు
-
I Nobody Trailer : పృద్వి రాజ్ సుకుమారన్.. ‘ఐ-నోబడి’ ట్రైలర్.. అదిరింది
-
Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
-
TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్గా అరూప్ రాయ్ ప్రకటన!
-
Jamun: రోజుకు 8 నుంచి 10 నేరేడు పండ్లు.. డాక్టర్లు చెప్పిన ఆరోగ్య రహస్యం!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
ట్రెండింగ్
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!