Indus Waters Treaty: భారత్కు పాక్ వార్నింగ్.. సింధూ జలాల కోసం చిల్లర హెచ్చరికలు!
- సింధూ జలాలపై పాకిస్థాన్ ద్వంద వైఖరి..
- నీటి సరఫరాను పునరుద్ధరించాలని భారత్కు పాక్ వార్నింగ్..
- సింధూ జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని కోరిన పాక్ విదేశాంగ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Waters Treaty: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్కు సింధూ జలాలను ఆపేస్తూ.. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఓ వైపు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టో బెదిరింపులకు దిగుతుంటే.. మరోవైపు తమకు నీటిని రిలీజ్ చేయాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖ ఇండియాను బతిమిలాడుతుంది. తమ దేశానికి నిలిపివేసిన సింధూ జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని తాజాగా భారత్ ని కోరింది. ఈ ఒప్పందాన్ని నమ్మకంగా, న్యాయబద్ధంగా కొనసాగించాలని పేర్కొనింది.
Read Also: Heavy Rains Alert: బంగాళాఖాంతంలో అల్ప పీడనం.. మరో ఆరు రోజులు భారీ వర్షాలు..!
Also Read
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
అయితే, భారత్పై అణు హెచ్చరికలను జారీ చేస్తూ పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ మరోసారి నోరు పారేసుకున్నారు. భారత్ అనేది హైవేపై వస్తున్న ఒక కారులాంటిది. కానీ, పాకిస్థాన్ మాత్రం కంకరతో నిండిన ఓ డంప్ లారీ లాంటిది అని పోల్చారు. ఒకవేళ కారు వచ్చి లారీని ఢీకొంటే ఎవరికి నష్టం? అని తన ప్రసంగంలో అతడు పేర్కొన్నాడు. ఆ దేశ విదేశాంగశాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో సైతం భారత్పై చిల్లర వ్యాఖ్యలు చేశారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేస్తే.. యుద్ధం చేయడం తప్ప మరో మార్గం లేదని గప్పలు కొట్టాడు. వీరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పాక్ విదేశాంగ శాఖ నీటిని విడుదల చేయాలని భారత్ను అభ్యర్థించడం గమనార్హం.
Read Also: ZPTC Elections :ఎంపీ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి కౌంటర్
కాగా, 1960ల్లో భారత్- పాకిస్థాన్ సింధూ నదీ జలాల ఒప్పందం చేసుకున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి దృష్ట్యా దీని అమలును ఇండియా నిలిపివేయడంతో దాయాది దేశానికి నీటి సమస్య ఎక్కువ అయింది. పాక్ లోని జలాశయాల్లో నీటిమట్టం దారుణంగా దిగజారిపోయింది. ఇక వాటి నుంచి నీటిని తీసుకోలేని స్థితి కొనసాగుతుంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం సుమారు 15 శాతం మేర తగ్గిపోయింది. ఎండాకాలంలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్లో మరిన్ని కష్టాలు తప్పవని దాయాది దేశ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఉగ్రవాదంపై పాక్ తీరు మార్చుకునే వరకూ సింధూ జలాల నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!