Pakistan: పాకిస్తాన్ నేవీ హెచ్చరిక.. సర్క్రీక్ సమీపంలో దాయాది యుద్ధ విన్యాసాలు..
- పాక్ సరిహద్దుల్లో భారత త్రివిధ దళాల ‘‘త్రిశూల్’’ ఎక్సర్సైజ్..
- అదే ప్రాంతంలో నేవీ హెచ్చరికలు జారీ చేసిన పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత సైన్యం సర్క్రీక్ సరిహద్దు ప్రాంతంలో త్రివిధ దళాల ‘‘త్రిశూల్’’ సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ ప్రాంతంలో భారత్ పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే, త్రిశూల్ విన్యాసాల కోసం, వైమానిక స్థలాన్ని భారత్ రిజర్వ్ చేసుకున్న ప్రాంతంలోనే, పాకిస్తాన్ తన ఫైరింగ్ ఎక్సర్సైజ్ కోసం శనివారం నేవీ నావిగేషన్ హెచ్చరికల్ని జారీ చేసింది. దీనిని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) విశ్లేషకుడు డామియన్ సైమన్ నివేదించారు.
అక్టోబర్ 28-29 వరకు మధ్య, దక్షిణ పాకిస్తాన్ అంతటా వైమానిక మార్గాలను పరిమితం చేస్తూ, ఇస్లామాబాద్ నోటమ్ (నోటీసు టు ఎయిర్మెన్ (NOTAM)) జారీ చేసింది. కారణాలు చెప్పనప్పటికీ, పాకిస్తాన్ సైనిక విన్యాసాలు లేదా ఆయుధ పరీక్షలు నిర్వహిస్తుందని అంతా భావించారు. ఇదే సమయంలో భారత్ నిర్వహిస్తున్న భారీ యుద్ధ విన్యాసాల కారణంగా పాకిస్తాన్ ఈ చర్య తీసుకుందని అంతా అనుకున్నారు.
Also Read
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
Read Also: Pakistan: భారత్ మాపై రెండు వైపులా యుద్ధం చేస్తోంది.. పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు..
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు భారత్ త్రిశూల్ ఎక్స్ర్సైజ్ నిర్వహిస్తోంది. దేశంలో ఇటీవల సంవత్సరాల్లో అత్యంత ముఖ్యమైన ఉమ్మడి సైనిక కార్యకలాపాలుగా రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని అభివర్ణించింది. పాక్ సరిహద్దు వెంబడి సర్క్రీక్ ప్రాంతంలో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ నేవీ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
సైమన్ పంచుకున్న ఉపగ్రహ చిత్రాల్లో, భారత్ ఈ వార్ ఎక్సర్సైజ్ కోసం 28,000 అడుగుల వరకు గగనతలాన్ని రిజర్వ్ చేసినట్లు సూచించారు. గుజరాత్ తీరం నుంచి అరేబియా సముద్రంలోకి ఈ ప్రాంతం విస్తరించి ఉంది. భారత్ రిజర్వ్ చేసుకున్న ప్రాంతంలోని, కొంత స్థలంలో పాక్ నేవీ నావిగేషన్ వార్నింగ్ జారీ చేసింది. భారత్ నిర్వహిస్తున్న ఈ విన్యాసాలను పాకిస్తాన్ నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల, భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల తర్వాత నుంచి ఒకింత భయంతో ఉంది. పలు సందర్భాల్లో సైనిక అధికారులు, రక్షణ మంత్రి మాట్లాడుతూ.. పాక్ తోక జాడిస్తే ‘‘ఆపరేషన్ సిందూర్ 2.0’’ జరుగుతుందని హెచ్చరించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతంతో పాకిస్తాన్ తన నేవీ కార్యకలాపాలను పెంచింది. దీంతో, ఈసారి పాక్ ఏదైనా చర్యకు దిగితే దాని హిస్టరీ, భౌగోళిక స్వరూపం పూర్తిగా మారుతుందని భారత్ హెచ్చరికలు జారీ చేసింది.
తాజావార్తలు
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Dhruv Vikram : అనుపమతో బ్రేకప్.. కామెంట్స్ పై ధృవ్ విక్రమ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Rhea Chakraborty: సుశాంత్ మరణం నా జీవితాన్నే మార్చేసింది.. నాన్నకు ఉద్యోగం కూడా పోయింది: రియా చక్రవర్తి
-
Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
ట్రెండింగ్
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!