Jagdeep Dhankhar: రాజ్యసభలో నోట్లకట్ట వ్యవహారం బాధించింది
- రాజ్యసభలో నోట్లకట్ట వ్యవహారం బాధించింది
- రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభలో నోట్ల కట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. డిసెంబర్ 6న కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ సీటు దగ్గర కరెన్సీ నోట్ల ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో తీవ్ర అలజడి చెలరేగింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర ఆరోపణలు జరిగాయి. దీంతో సెక్యూరిటీ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇదే అంశంపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ స్పందించారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాజ్యసభలో దొరికిన నోట్ల కట్ల వ్యవహారం తనను ఎంతగానో బాధించిందని తెలిపారు. ఎవరూ కూడా క్లెయిమ్ చేయకపోవడం మరింత బాధించిందని పేర్కొ్న్నారు. నైతిక ప్రమాణాలకు ఇది సవాల్ విసురుతోందన్నారు.
ఇది కూడా చదవండి: Anshu: భూమ్మీదున్న లవ్లీయస్ట్ మ్యాన్ త్రినాథరావు.. ఇక వదిలేయండి!
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
రాజ్యసభలో అనేక ఏళ్లుగా నైతిక విలువల కమిటీ లేదని ధన్ఖడ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 1990 చివరిలో మాత్రమే రాజ్యసభలో తొలిసారి ఈ కమిటీ ఏర్పాటు అయిందని తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్గా ఒక విషయం మాత్రం చెప్పగలనని… సభలో ఉన్నవారు గొప్ప అర్హతలు, అనుభవం కలిగి ఉన్నవారేనన్నారు. కానీ సభ కార్యకలాపాల విషయానికి వస్తే.. వేరేవారి మార్గనిర్దేశంలో నడచుకుంటారని విచారం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: YS Jagan: తెలుగు ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు..
డిసెంబర్ 6న రాజ్యసభలో జరిగిన నోట్ల వ్యవహారంపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ధన్ఖడ్ ప్రకటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు బయటకు చెప్పడమేంటని నిలదీశారు. అయితే తాను సభకు నోట్ల కట్టను తీసుకురాలేదని సింఘ్వీ స్పష్టం చేశారు. తన సీటు దగ్గర కరెన్సీ నోట్లు దొరకడం భద్రతా వైఫల్యమేనన్నారు. సభలో ప్రతి సీటు చుట్టూ గాజు గదినిగానీ, ముళ్లతో కూడిన ఇనుప కంచెనుగానీ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Bima Sakhi Yojana: 10th పాసైన మహిళల కోసం కొత్త స్కీమ్.. ఇంట్లోనే ఉంటూ వేలల్లో సంపాదన!
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..