ఖలిస్థాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్, అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్ రషీద్ శుక్రవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు. స్పీకర్ ఛాంబర్లో ఓం బిర్లా వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు. పెరోల్పై వచ్చి లోక్సభ ఎంపీలుగా ప్రమాణం చేశారు.
ఇది కూడా చదవండి: Terrorist Died: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన టెర్రరిస్ట్ మృతి..
అమృతపాల్ సింగ్, ఇంజనీర్ రషీద్ ఇద్దరూ కూడా ప్రస్తుతం జైల్లో ఉంటున్నారు. జైలు నుంచే లోక్సభ ఎన్నికల్లో పోటీ విజయం సాధించారు. అమృతపాల్ సింగ్(31) పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి గెలవగా.. రషీద్(56) జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి విజయం సాధించారు. అయితే వీరిద్దరు ఎంపీలుగా ప్రమాణం చేసేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. దీంతో శుక్రవారం లోక్సభ ఎంపీలుగా ప్రమాణం చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ అస్సాం జైలులో ఉండగా.. ఉగ్రవాద నిరోధక చట్టం UAPA కింద అభియోగాలు మోపబడి రషీద్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
ఇది కూడా చదవండి: UK-INDIA: నూతన బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్..బ్రిటన్-భారత్ మధ్య సంబంధాల పరిస్థితేంటి..?