Parliament winter session: రేపటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..‘‘సర్’’పై ప్రతిపక్షాల పోరు..
- రేపటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..
- ‘‘సర్’’పై పోరుకు ప్రతిపక్షాలు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament winter session: శీతాకాలంలో రాజకీయ వేడిని పుట్టించేలా రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆదివారం ఆల్ పార్టీ మీట్ నిర్వహించారు. అయితే, ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం నిర్వహిస్తు్న్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చకు డిమాండ్ చేశాయి. ఓటర్ జాబితాలో నకిలీ ఓటర్లను ఏరివేసేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. అయితే, దీని వల్ల బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓ)లపై తీవ్ర ఒత్తిడి, పనిభారం ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే, సర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మరో 7 రోజులు పొడగించింది. ఎన్నికల కమిషన్ 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది.
Read Also: Pakistan: పాక్ రాజ్యాంగ సవరణపై యూఎన్ తీవ్ర హెచ్చరిక
Also Read
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
- Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
- CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. సమావేశాలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా ఉంటాయని, 36 పార్టీలు, 50 మంది నాయకులు పాల్గొన్నట్లు చెప్పారు. చాలా మంది ప్రతిపక్ష నేతలు సర్ ప్రక్రియపై చర్చను కోరారని, కానీ పార్లమెంట్ ఎజెండాను నిర్ణయించే అధికారం కేవలం బిజినెస్ అడ్వైజరీ కమిటీకి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం సర్పై చర్చకు అంగీకరించకుంటే, సమావేశాలకు అంతరాయం కలిగించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
అన్ని ప్రతిపక్షాలు సర్పై చర్చకు డిమాండ్ చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ చెప్పారు. సర్ ప్రక్రియను తొందరపడి పూర్తి చేయవద్దని ప్రతిపక్షాలు పదే పదే హెచ్చరించినప్పటికీ, ప్రభుత్వం తప్పించుకుంటుందని ఆరోపించారు. సర్ ప్రక్రియా ప్రణాళిక ప్రకారం జరగడం లేదని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు. ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీఎల్ఓలపై విపరీత ఒత్తిడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఎల్ఓలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొత్త ఓట్లను చేర్చడం కన్నా, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తీసేయడంపై ఎక్కువ దృష్టిపెడుతున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Yash Rejected 7 Films: 7 సినిమాలు వదులుకున్న యశ్.. మనీ విషయంలో రాకింగ్ స్టార్ ఫార్ములా ఇదేనట!
-
Anil Ravipudi: వీకెండ్ కూడా వర్కింగ్ డేనే.. అనిల్ రావిపూడి టీమ్ దూకుడు మామూలుగా లేదుగా!
-
Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
-
CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
-
Thyroid Symptoms: ఇంట్లోనే థైరాయిడ్ సమస్యను నిర్ధారించుకోవడం సాధ్యమేనా?
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?