Parliament winter session: రేపటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..‘‘సర్’’పై ప్రతిపక్షాల పోరు..
- రేపటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..
- ‘‘సర్’’పై పోరుకు ప్రతిపక్షాలు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament winter session: శీతాకాలంలో రాజకీయ వేడిని పుట్టించేలా రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆదివారం ఆల్ పార్టీ మీట్ నిర్వహించారు. అయితే, ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం నిర్వహిస్తు్న్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చకు డిమాండ్ చేశాయి. ఓటర్ జాబితాలో నకిలీ ఓటర్లను ఏరివేసేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. అయితే, దీని వల్ల బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓ)లపై తీవ్ర ఒత్తిడి, పనిభారం ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే, సర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మరో 7 రోజులు పొడగించింది. ఎన్నికల కమిషన్ 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది.
Read Also: Pakistan: పాక్ రాజ్యాంగ సవరణపై యూఎన్ తీవ్ర హెచ్చరిక
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. సమావేశాలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా ఉంటాయని, 36 పార్టీలు, 50 మంది నాయకులు పాల్గొన్నట్లు చెప్పారు. చాలా మంది ప్రతిపక్ష నేతలు సర్ ప్రక్రియపై చర్చను కోరారని, కానీ పార్లమెంట్ ఎజెండాను నిర్ణయించే అధికారం కేవలం బిజినెస్ అడ్వైజరీ కమిటీకి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం సర్పై చర్చకు అంగీకరించకుంటే, సమావేశాలకు అంతరాయం కలిగించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
అన్ని ప్రతిపక్షాలు సర్పై చర్చకు డిమాండ్ చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ చెప్పారు. సర్ ప్రక్రియను తొందరపడి పూర్తి చేయవద్దని ప్రతిపక్షాలు పదే పదే హెచ్చరించినప్పటికీ, ప్రభుత్వం తప్పించుకుంటుందని ఆరోపించారు. సర్ ప్రక్రియా ప్రణాళిక ప్రకారం జరగడం లేదని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు. ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీఎల్ఓలపై విపరీత ఒత్తిడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఎల్ఓలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొత్త ఓట్లను చేర్చడం కన్నా, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తీసేయడంపై ఎక్కువ దృష్టిపెడుతున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
-
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
-
Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
-
Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
-
Dengue Insurance Claim: ‘డెంగ్యూ సీరియస్ కాదట’.. ప్లేట్లెట్స్ 70 వేల కంటే తగ్గలేదంటూ మెడిక్లెయిమ్ రిజెక్ట్?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!