Parliament winter session: రేపటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..‘‘సర్’’పై ప్రతిపక్షాల పోరు..
- రేపటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..
- ‘‘సర్’’పై పోరుకు ప్రతిపక్షాలు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament winter session: శీతాకాలంలో రాజకీయ వేడిని పుట్టించేలా రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆదివారం ఆల్ పార్టీ మీట్ నిర్వహించారు. అయితే, ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం నిర్వహిస్తు్న్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చకు డిమాండ్ చేశాయి. ఓటర్ జాబితాలో నకిలీ ఓటర్లను ఏరివేసేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. అయితే, దీని వల్ల బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓ)లపై తీవ్ర ఒత్తిడి, పనిభారం ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే, సర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మరో 7 రోజులు పొడగించింది. ఎన్నికల కమిషన్ 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది.
Read Also: Pakistan: పాక్ రాజ్యాంగ సవరణపై యూఎన్ తీవ్ర హెచ్చరిక
Also Read
- CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
- Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
- Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
- Ratna Debnath: 'నేను నా కూతురిని కోల్పోయా.. ఆమె తన కుర్చీని కోల్పోయింది'.. మమతపై ఆర్జీ కార్ బాధితురాలి తల్లి విమర్శలు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. సమావేశాలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా ఉంటాయని, 36 పార్టీలు, 50 మంది నాయకులు పాల్గొన్నట్లు చెప్పారు. చాలా మంది ప్రతిపక్ష నేతలు సర్ ప్రక్రియపై చర్చను కోరారని, కానీ పార్లమెంట్ ఎజెండాను నిర్ణయించే అధికారం కేవలం బిజినెస్ అడ్వైజరీ కమిటీకి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం సర్పై చర్చకు అంగీకరించకుంటే, సమావేశాలకు అంతరాయం కలిగించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
అన్ని ప్రతిపక్షాలు సర్పై చర్చకు డిమాండ్ చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ చెప్పారు. సర్ ప్రక్రియను తొందరపడి పూర్తి చేయవద్దని ప్రతిపక్షాలు పదే పదే హెచ్చరించినప్పటికీ, ప్రభుత్వం తప్పించుకుంటుందని ఆరోపించారు. సర్ ప్రక్రియా ప్రణాళిక ప్రకారం జరగడం లేదని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు. ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీఎల్ఓలపై విపరీత ఒత్తిడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఎల్ఓలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొత్త ఓట్లను చేర్చడం కన్నా, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తీసేయడంపై ఎక్కువ దృష్టిపెడుతున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Karuppu Success Meet: ‘కరుప్పు 2’పై సూర్య బిగ్ హింట్..
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
RCB vs GT Qualifier 1: బెంగళూరు vs గుజరాత్ మెగా సమరం.. పిచ్, లైవ్ స్ట్రీమింగ్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
-
Suriya 50: ‘కరుప్పు’ హిట్ జోష్లో సూర్య.. 50వ సినిమాకు భారీ ప్లాన్!
-
Ananya Panday: అనన్య పాండేపై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?