Parliament winter session: రేపటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..‘‘సర్’’పై ప్రతిపక్షాల పోరు..
- రేపటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..
- ‘‘సర్’’పై పోరుకు ప్రతిపక్షాలు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament winter session: శీతాకాలంలో రాజకీయ వేడిని పుట్టించేలా రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆదివారం ఆల్ పార్టీ మీట్ నిర్వహించారు. అయితే, ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం నిర్వహిస్తు్న్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చకు డిమాండ్ చేశాయి. ఓటర్ జాబితాలో నకిలీ ఓటర్లను ఏరివేసేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. అయితే, దీని వల్ల బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓ)లపై తీవ్ర ఒత్తిడి, పనిభారం ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే, సర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మరో 7 రోజులు పొడగించింది. ఎన్నికల కమిషన్ 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది.
Read Also: Pakistan: పాక్ రాజ్యాంగ సవరణపై యూఎన్ తీవ్ర హెచ్చరిక
Also Read
- Delhi: ఢిల్లీని కమ్మేసిన చీకట్లు.. మధ్యాహ్నమే అర్ధరాత్రిని తలపించిన ఇసుక తుఫాన్!
- Kumkum Bhagya: ప్రముఖ యువ నటి సంచితా ఉగలే అనుమానాస్పద మృతి!
- Explainer: ఎల్నినో ఎఫెక్ట్.. రైతులకు డబుల్ షాక్.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
- Pawan Kalyan: తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు!
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. సమావేశాలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా ఉంటాయని, 36 పార్టీలు, 50 మంది నాయకులు పాల్గొన్నట్లు చెప్పారు. చాలా మంది ప్రతిపక్ష నేతలు సర్ ప్రక్రియపై చర్చను కోరారని, కానీ పార్లమెంట్ ఎజెండాను నిర్ణయించే అధికారం కేవలం బిజినెస్ అడ్వైజరీ కమిటీకి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం సర్పై చర్చకు అంగీకరించకుంటే, సమావేశాలకు అంతరాయం కలిగించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
అన్ని ప్రతిపక్షాలు సర్పై చర్చకు డిమాండ్ చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ చెప్పారు. సర్ ప్రక్రియను తొందరపడి పూర్తి చేయవద్దని ప్రతిపక్షాలు పదే పదే హెచ్చరించినప్పటికీ, ప్రభుత్వం తప్పించుకుంటుందని ఆరోపించారు. సర్ ప్రక్రియా ప్రణాళిక ప్రకారం జరగడం లేదని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు. ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీఎల్ఓలపై విపరీత ఒత్తిడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఎల్ఓలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొత్త ఓట్లను చేర్చడం కన్నా, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తీసేయడంపై ఎక్కువ దృష్టిపెడుతున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
POK: ‘మా ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోండి..’ పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొత్త పోరాటం..!
-
Delhi: ఢిల్లీని కమ్మేసిన చీకట్లు.. మధ్యాహ్నమే అర్ధరాత్రిని తలపించిన ఇసుక తుఫాన్!
-
Kumkum Bhagya: ప్రముఖ యువ నటి సంచితా ఉగలే అనుమానాస్పద మృతి!
-
TPCC Mahesh Goud: పవన్ కళ్యాణ్పై మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
-
Tollywood Focus: హీరోలకంటే డైరెక్టర్లకే క్రేజ్ ఎక్కువ.. కానీ?
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!