Presidential Election 2022: నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే కాగా… ఈ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి, యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.. పలు సమార్లు సమావేశమైన విపక్షాలు చాలా మంది అభ్యర్థుల పేర్లను పరిశీలించినా.. చివరకు ఏకాభిప్రాయంతో అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. దీంతో, ఇవాళ ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షం నుంచి ఏకాభిప్రాయ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి సిన్హా ఎంపికయ్యారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
సమర్ధుడైన అడ్మినిస్ట్రేటర్గా, నిష్ణాతుడైన పార్లమెంటేరియన్గా, కేంద్ర మంత్రిగా వివిధ హోదాల్లో దేశానికి సేవలందించారు. ఆర్థిక మరియు విదేశీ వ్యవహారాల వంటి కీలక శాఖలను కూడా ఆయన నిర్వహించారు. ఇక, ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రధాన పోటీదారులు కాగా, ఇప్పటి వరకు కనీసం 30 మంది తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇందులో ముంబైకి చెందిన ఒక మురికివాడ నివాసి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త మరియు ఢిల్లీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఉన్నారు. కాగా, విపక్షాల అభ్యర్థిగా శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు గోపాల్ కృష్ణ గాంధీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించడంతో సిన్హా పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. జూన్ 21న ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా సిన్హా పేరును ప్రకటించారు. బీజేపీ మాజీ నేత అయిన యశ్వంత్ సిన్హా గత వారం మద్దతు కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లను కూడా సంప్రదించారు. ఇక, ఇవాళ జరగనున్న నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పలు పార్టీల నేతలతో పాటు టీఆర్ఎస్ బృందం కూడా పాల్గొనబోతోంది.. ఇందుకోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఢిల్లీ చేరుకున్నారు.. కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరలు పాల్గొనబోతున్నారు.
తాజావార్తలు
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
-
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!