Rahul Gandhi: ఇది భారత సమాఖ్యపై దాడి.. “ఒకే దేశం-ఒకే ఎన్నిక”పై రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: దేశవ్యాప్తంగా ప్రస్తుతం రాజకీయాలు అన్నీ ముందుస్తు ఎన్నికలు, జమిలీ ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారనే చర్చ మొదలైంది. దీనికి అనుగుణంగానే కేంద్రం మాజీ రాష్ట్రపతితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉంటే ఒకే దేశం-ఒకే ఎన్నికపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇండియా కూటమికి భయపడే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నాయి. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చని, ఈ డిసెంబర్ లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మమతా బెనర్జీ, నితీష్ కుమార్ వంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read
Read Also: Amit Shah: ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోంది.. సీఎం కొడుకు వ్యాఖ్యలపై ఫైర్..
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’పై స్పందించారు. ఇది భారత సమాఖ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణించారు. కేంద్రం ఒకే దేశం-ఒకే ఎన్నికపై ముందుకు వెళ్తున్న సమయంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే ఆలోచన భారత యూనియన్, అన్ని రాష్ట్రాలపై దాడి. భారత్ అంటే రాష్ట్రాల సమాఖ్య’’ అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
ఏకకాలంలో లోకసభ, అన్ని రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించే విషయమై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరికి చోటు కల్పించారు. అయితే తాను ఈ కమిటీలో చేరేది లేదని ఆయన స్పష్టం చేశారు మొత్తం 8 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీలో అమిత్ షా, గులాంనబీ ఆజాద్, సంజయ్ కొఠారి, హరీష్ సాల్వే, సుభాష్ కష్యప్, ఎస్కే సింగ్ ఉన్నారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై వీలైనంత త్వరగా పరిశీలించి సిఫార్సులు చేయాలని ఎనిమిది మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం కోరింది.
INDIA, that is Bharat, is a Union of States.
The idea of ‘one nation, one election’ is an attack on the 🇮🇳 Union and all its States.
— Rahul Gandhi (@RahulGandhi) September 3, 2023
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!