Odisha Train Tragedy: గుండ్లు కొట్టించుకుంటున్న బహనాగా ప్రజలు.. మృతుల ఆత్మలకు శాంతి కలగాలని పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train Tragedy: ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ సమీపంలోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు, యశ్వంతపూర్ రైళ్లు ఢీకొట్టుకున్న ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి కలిగించింది. రైల్వే శాఖ మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ చూడని ఘోరమైన ప్రమాదం జరిగింది. దాదాపుగా 280 కన్నా ఎక్కువ మంది ప్రజలు మరణించారు. 1000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఒక్కసారిగా బహనాగా బజార్ అనే చిన్న గ్రామం ఈ ప్రమాదంతో వార్తల్లో నిలిచింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు సహాయక చర్యల్లో పాల్గొని చాలా మంది ప్రాణాలు కాపాడగలిగారు. చాలా మంది కోసం అక్కడి యువకులు రక్తదానం చేశారు.
Read Also: Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. కొండెక్కిన కోడి ధరలు..!
Also Read
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
- Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
ఇదిలా ఉంటే ఇంతటి ఘోర ప్రమాదాన్ని బహనాగా ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. మరణించిన వారికి స్మారకంగా హిందూ సంప్రదాయం ప్రకారం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగి 10 రోజులు పూర్తయిన సందర్భంగా సామూహికంగా గ్రామస్తులు గుండ్లు కొట్టించుకుంటున్నారు. స్థానికులు, వాలంటీర్లు, సామాజిక కార్యకర్తలు క్షౌరం చేయించుకుంటున్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరేలా హిందూ సంప్రదాయం ప్రకారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మరణించిన వ్యక్తుల జ్ఞాపకార్థం మరియు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సంస్మరణ సభను నిర్వహించారు. 3 రోజుల సంస్మరణ సభ బహనాగ హైస్కూల్ ప్రాంగణం సమీపంలోని మైదానంలో నిర్వహించారు. 10 రోజు సామూహిక శిరోముండనం చేయించుకున్నారు. 11వ రోజు ‘విశ్వ శాంతి మహా యజ్ఞం’, ‘అస్తప్రహరి నామ సంకీర్తన’, ‘అఖండ గాయత్రీమంత్రం’ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 12 రోజు ‘సత్సంగం’, క్యాండిల్ లైట్ మార్చ్ ను ఏర్పాటు చేశారు. బహనాగాలో జరిగిన విషాద ట్రిపుల్ రైలు ప్రమాదంలో కనీసం 288 మంది మరణించగా, 1000 మందికి పైగా ప్రజలు తీవ్ర గాయాలతో తృటిలో తప్పించుకున్నారు.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..