India Health Care: ఇండియాలో పోషకాహార లోపం.. 16 శాతంగా నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Health Care: మనిషి బ్రతకాలంటే ఆహారం తీసుకోవాలి. అందులో ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. పోషాకాహారం లేకపోతే ప్రజలు ఆరోగ్యంగా ఉండరు. పోషకాహార లోపంతో ఇండియాలో ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే పోషకాహార లోపాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వంతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోషకాహార సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే పోషకాహార లోపం సమస్య కేవలం ఇండియాలోనే కాదు.. ఇది యూనివర్సల్ సమస్యగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపం ఉంది. అది 2021 కంటే 2023లో బాగా పెరిగిందని నివేదిక పేర్కొంది.
Read also: Rythu Bandhu: నేటి నుంచే ఖాతాల్లో రైతు బంధు నగదు.. పదకొండో విడుత సాయానికి సర్కారు సిద్ధం
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
ఇండియాలో పోషకాహార లోపం సమస్య బాగానే ఉంది. ఇందులో కూడా ప్రధానంగా సూక్ష్మ పోషకాల లోపం తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని ఆహార నిపుణులు పేర్కొన్నారు. దేశంలో ప్రజల ఆరోగ్యాలను హరిస్తున్న ఈ పైకి కనిపించని ఆకలి సమస్యను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఈ మేరకు అంతర్జాతీయ ఆహార పాలసీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఎఫ్పీఆర్ఐ) ఇటీవల ది గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్టు(జీఎఫ్పీఆర్)-2023 పేరుతో నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపం సమస్యతో బాధ పడుతున్న వారి సంఖ్య 2021 నాటికి 76.8 కోట్లకు పెరిగింది. ఇది 2014లో 57.2 కోట్లుగా ఉండగా.. అదికాస్త 2021కి 34.2 శాతం పెరిగిందని నివేదిక పేర్కొన్నది. పోషకాహార లోపం సమస్య 2019-21 మధ్యలో ఆఫ్గానిస్థాన్లో 30 శాతం, పాకిస్థాన్లో 17శాతం ఉంది. భారత్లో 16 శాతం, బంగ్లాదేశ్లో 12 శాతం, నేపాల్లో 6 శాతం, శ్రీలంకలో 4 శాతంగా ఉన్నదని నివేదిక ప్రకటించింది.
Read also: Shiva stotram: వివాహం జరగాలంటే సోమవారం ఈ సోత్రం వినండి
భారత్లో ఆహార ఉత్పత్తికి సమస్య లేదు. కానీ సూక్ష్మ పోషకాల సమస్య ఎక్కువగా ఉంది. ఇండియాలో ఆహార ఉత్పత్తి లభ్యత మెరుగ్గానే ఉన్నప్పటికీ, అవి ప్రజలకు చేరడంలో సమస్యలు ఉన్నాయని ఐఎఫ్పీఆర్ఐ దక్షిణాసియా డైరెక్టర్ షాహిదుర్ రషీద్ పేర్కొన్నారు. ఆరోగ్యానికి బియ్యం, గోధుమలు వంటి ఆహార పదార్థాలు తింటే సరిపోదని, వాటి ద్వారా అందుతున్న పోషకాలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. సూక్ష్మ పోషకాల లోపంగా పిలిచే పైకి కనిపించని ఆకలి(హిడెన్ హంగర్) అనేది భారత్తో సహా దక్షిణాసియా ప్రాంతాల్లో అధికంగా ఉన్నదని నివేదిక పేర్కొంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు తరాల కోసం సరిపడా సూక్ష్మ పోషకాలను అందించే మార్గాలపై ఆలోచన చేయాలని సూచించారు. పర్యావరణ మార్పులతో పాటు పెరిగే ఉష్ణోగ్రతల కారణంగా బియ్యం, గోధుమలు వంటి పంటల్లో పోషకాల నాణ్యత తగ్గుతుందని ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఆర్ఆర్ఐ) ప్రతినిధి రంజితా పుష్కర్ పేర్కొన్నారు. పోషకాహార భద్రత కోసం ప్రత్యేక విధానం ఉండాల్సిన అవసరం ఉన్నదని అగ్రికల్చర్ ఎకనమిక్స్ రిసెర్చ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రమోద్ జోషి అభిప్రాయపడ్డారు. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ పోషకాహార లోపాన్ని అధిగమించడానికి కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు.
- Tags
- care
- Deficiency
- Health
- india
- Nutritional
తాజావార్తలు
-
Kaviya Maran: సన్రైజర్స్ ఓనరమ్మతో అనిరుధ్ పెళ్లి పక్కా.. బంధువుల ఇంటర్వ్యూతో లీకైన పెళ్లి ముచ్చట..
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!