Central Minister Anurag Thakur: వీధుల్లో నిరసనలు కాదు.. పార్లమెంటులో చర్చించండి: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Minister Anurag Thakur: వీధుల్లో నిరసనలు చేపట్టడం కాదని.. ప్రజాసమస్యలపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సూచించారు. మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చ జరగకుండా విపక్షాలు పారిపోతున్నాయని విమర్శించారు. వీధుల్లో నిరసనలు చేయాలని కోరుకుంటే.. పార్లమెంటుకు ఎన్నికై ప్రయోజనం ఏముందని మండిపడ్డారు. మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబడుతోన్న విపక్ష పార్టీలు.. వారం రోజులుగా పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విపక్ష పార్టీల నిరసనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో విపక్ష పార్టీలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు. జులై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు చేస్తున్న నిరసనలను ఉద్దేశిస్తూ ఠాకూర్ విమర్శలు చేశారు.
Read also: Fahadh Faasil: ఎవర్రా ఈ రత్నవేలు.. సోషల్ మీడియా అంతా ఒకటే మోత
Also Read
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
‘మీరు వీధుల్లో నిరసనలు లేవనెత్తాలని కోరుకుంటే.. పార్లమెంటుకు ఎన్నికై ప్రయోజనం ఏమిటనీ కేంద్ర మంత్రి ఠాకూర్ ప్రశ్నించారు. దయచేసి సభకు వచ్చి.. చర్చలో పాల్గొనాలని విపక్షాలకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. వారు కోరుకున్న మణిపూర్ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చర్చ నుంచి పారిపోవాల్సిన అవసరం విపక్షాలకు ఏముందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. సోమవారం పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడిన ఆయన.. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దీనిపై ప్రకటన చేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన మాటలను గుర్తుచేశారు. ఇక మణిపూర్లో ‘ఇండియా’ బృందం చేసిన పర్యటనపై విమర్శలు చేసిన ఠాకూర్.. పశ్చిమ బెంగాల్లో వారెందుకు పర్యటించలేదని ప్రశ్నించారు. యూపీఏ హయాంలోనూ మణిపూర్లో ఆరు నెలలపాటు హింస చెలరేగిందని గుర్తు చేసిన కేంద్ర మంత్రి .. అప్పటి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని.. ఎందుకు పర్యటించలేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!