Noida Farmer: అదృష్టమంటే ఇదే కదా? హెలికాప్టర్ కొని థాయ్లాండ్ టూర్.. రైతు జీవితాన్ని మార్చేసిన మోడీ సర్కార్
- నోయిడా రైతు తలుపు తట్టిన అదృష్టం
- మోడీ సర్కార్ రూపంలో కలిసొచ్చిన అదృష్టం
- హెలికాప్టర్ కొనుగోలు చేసి థాయ్లాండ్ టూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితం బాగుపడాలంటే అదృష్టం కలిసి రావాలనో.. లేదంటే లాటరీ అయినా తగలాలనో అంటుంటారు. ఈ మాటలు సరదాగే అనుకున్న కూడా.. నిజంగా జరిగితే మాత్రం లైఫ్ మొత్తం మారిపోతుంది. నోయిడాలో ఓ రైతు జీవితాన్ని మోడీ సర్కార్ మార్చేసింది. రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. అంతేకాకుండా ఓ హెలికాప్టర్ కొనుగోలు చేసి ఫారిన్ టూర్కు కూడా రెడీ అయిపోయాడు. అసలేం జరిగింది? హెలికాప్టర్-మోడీ సర్కార్కు ఉన్న లింకేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
నిన్నామొన్నటి దాకా ఆ రైతులంతా సాధారణ అన్నదాతలు. ఏదో తమకున్న పొలాల్లో పంటలు పండించుకుని జీవితాన్ని సాగిస్తున్నారు. అలాంటి కర్షకులకు మోడీ సర్కార్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. అంతే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు. ఉన్నట్టుండి పేద బతుకులు లగ్జరీగా మారిపోయాయి. ఇదంతా కేవలం మోడీ సర్కార్ పుణ్యమా? అని అదృష్టం కలిసొచ్చింది.
Also Read
శనివారం ప్రధాని మోడీ నోయిడాలో దేశంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయంగా నోయిడాలో మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించేందుకు పూనుకుంది. అందుకోసం రైతుల దగ్గర పెద్ద ఎత్తున భూములు సేకరించింది. అయితే భూములకు పరిహారంగా అన్నదాతలకు కోట్లలో నగదు ముట్టజెప్పారు. అంతే ఒక్కసారిగా రైతుల దశ మారిపోయింది. లక్షల్లో కాకుండా ఏకంగా కోట్లలో కర్షకులకు డబ్బు అందింది. దీంతో నోయిడా రైతులందరూ భాగ్యవంతులైపోయారు.
ఏకంగా ఒక రైతుకు అయితే రూ.15 కోట్లు అందాయి. దీంతో అతడు ఒక హెలికాప్టర్ కొనుగోలు చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలిసి థాయ్లాండ్ పర్యటనకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తన కథనంలో వెల్లడించింది. లబ్ధిపొందిన రైతులు తమ ఆనందాన్ని, సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. నోయిడా ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వడంతో తమ జీవితాలు మారిపోయాయని పలువురు చెప్పుకొచ్చారు.
ఇక ఈ వార్త ప్రస్తుతంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురు రకరకాలుగా స్పందించారు. ‘‘ఇది శుద్ధ అవివేకం. మహారాష్ట్రలో కూడా ఇలాంటి కేసులు చూశాం. అక్కడ ప్రజలు కూడా పరిహారాన్ని అనేక విలాసవంతమైన కార్ల మీద ఖర్చుపెట్టి రెండేళ్లలోపే ఇంధనం వంటి ప్రాథమిక ఖర్చులకే ఇబ్బంది పడ్డారు. పూణె సమీపంలోని ముల్షి వంటి ప్రదేశాల్లో ఇలాంటి కథలు సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో తర్వాతి తరం కూడా నేరాల వైపు మళ్లింది..’’ అని రాసుకొచ్చాడు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!