Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
- నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం
- ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
- మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈవీ ఛార్జింగ్ చేస్తుండగా ఒక్కసారిగామంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో మంటలు బిల్డింగ్లోకి వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా… పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తూ పలువురిని రక్షించారు.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో బుధవారం నివాస భవనంలో చెలరేగిన భారీ మంటల్లో ఇద్దరు మృతి చెందగా, సుమారు 50 కుటుంబాలు భవనంలో చిక్కుకుపోయాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి భారీ సహాయక చర్యలు చేపట్టడంతో మిగిలిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Also Read
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఫేజ్-3 పోలీస్ స్టేషన్ పరిధిలోని మమూరా గ్రామంలో ఉన్న జీ+4 నివాస భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక విచారణలో ఎలక్ట్రిక్ బైక్ను ఛార్జింగ్ చేస్తుండగా స్పార్క్ రావడంతో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. అనంతరం మంటలు పార్కింగ్లో ఉన్న పెట్రోల్ వాహనాలకు వ్యాపించి భారీ అగ్నిప్రమాదానికి దారితీశాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. హైడ్రాలిక్ ప్లాట్ఫారమ్లు, రెస్క్యూ వాహనాలు, ఏడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో నివసిస్తున్న సుమారు 50 కుటుంబాల సభ్యులను సురక్షితంగా బయటకు తరలించారు.
గౌతమ్ బుద్ధ నగర్ జాయింట్ పోలీస్ కమిషనర్ రాజీవ్ నారాయణ్ మాట్లాడుతూ.. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉండటంతో అక్కడ చెలరేగిన మంటల నుంచి వచ్చిన దట్టమైన పొగ పై అంతస్తులకు వ్యాపించిందని తెలిపారు. పొగ పీల్చుకోవడంతో ఇద్దరి ఆరోగ్యం విషమించడంతో వారిని వెంటనే అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అనంతరం చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఈవీ ఛార్జింగ్ సమయంలో ఏర్పడిన స్పార్క్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని రాజీవ్ నారాయణ్ తెలిపారు. ఈ ఘటనపై ఫేజ్-3 పోలీస్ స్టేషన్లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, భవన యజమాని, లీజుదారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
-
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
-
Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్కు పెను ప్రమాదం..
-
Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..