Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ.. పూజల కొనసాగింపుకే హైకోర్టు మొగ్గు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Case: జ్ఞానవాపీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసి కోర్టు దక్షిణ సెల్లార్లో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో, ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, పూజలు కొనసాగించేందుకే హైకోర్టు మొగ్గు చూపించడంతో ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ తాకినట్లైంది.
మసీదు కమిటీ అంజుమన్ ఇంతేజామియా దాఖలు చేసిన పిటిషన్ని శుక్రవారం అలహాబాద్ హైకోర్టు విచారించి, ఈ మేరకు పూజల్ని నిలిపివేసేందుకు అనుమతించ లేదు. జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్తో కూడిన సింగిల్ బెంచ్ జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణం లోపల మరియు వెలుపల శాంతిభద్రతలను నిర్వహించాలని అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది.
Also Read
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
Read Also: Bride With Boyfriend: బ్యూటీ పార్లర్ నుంచి బాయ్ ఫ్రెండ్తో వధువు జంప్..! వరుడు పరిస్థితి..?
జ్ఞానవాపి దక్షిణ సెల్లార్ లో పూజలు నిర్వహించేందుకు వారణాసి కోర్టు అనుమతించడంతో మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ విషయంపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం సూచించింది. విచారణ సందర్భంగా మసీదు కమిటి తరుపున వాదిస్తున్న న్యాయవాదులు ఎస్ఏఫ్ఏ నఖ్వీ, పునీత్ గుప్తాలు నేలమాళిగలోని వ్యాస్ కా టేఖనా(సెల్లార్)లోని నాలుగు సెల్లార్లలో ఒకదానిని హిందూ పక్షం డిమాండ్ చేస్తుందని, దానికి వారణాసి కోర్టు ఆమోదించిందని వారు హైకోర్టుకు తెలిపారు. కాగా, హిందూ పక్షం తరుపున న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మసీదు కమిటీ పిటిషన్ని వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టున మసీదులో పూజలను ఆపలేమని తీర్పు చెప్పింది.
వివాదాస్పద జ్ఞానవాపి మసీదు స్థలంలో ఇంతకుముందు ఒక దేవాలయం ఉందని మరియు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 17వ శతాబ్దంలో కూల్చివేయబడిందని హిందూ పక్షం వాదిస్తోంది. ఇటీవల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వేలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక్కడి మసీదుకు ముందు ఒక పెద్ద దేవాలయం ఉందని తేల్చింది. హిందూ దేవతల విగ్రహాలు, 36 దేవనాగరి, కన్నడ, తెలుగు శాసనాలు బయటపడినట్లు రిపోర్టు ఇచ్చింది.
తాజావార్తలు
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
-
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
-
Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
-
AI Robot: మునిగిపోతున్న వారిని రక్షించే ఏఐ రోబోట్ ప్రయోగం విజయవంతం
-
OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!