Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News No Personal Use Of Mobile Phone By Govt Staff During Office Hours Says Madras High Court

High Court: ప్రభుత్వ ఉద్యోగులు సెల్‌ఫోన్లు వాడొద్దు.. హైకోర్టు ఆదేశాలు

Published Date :March 15, 2022 , 4:54 pm
By Sudhakar Ravula
High Court: ప్రభుత్వ ఉద్యోగులు సెల్‌ఫోన్లు వాడొద్దు.. హైకోర్టు ఆదేశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది హైకోర్టు… ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో పనివేళ సమయంలో మొబైల్‌ ఫోన్లు వాడడం, పనులపై వచ్చే ప్రజలను పట్టించుకోకపోడం.. కార్యాలయాల్లో ఏకంగా మొబైల్‌ గేమ్‌లు ఆడుతున్నారు అంటూ ఎన్నో విమర్శలు ఉన్నాయి.. ఇక, సెల్‌ఫోన్‌ వాడడం ఇప్పుడు సర్వసాధారణమైన విషయం అయిపోయింది.. పిల్లలు మొదలు పండు ముసలి వరకు సెల్‌ఫోన్‌ నిత్యావసరంగా మారిపోయింది.. అయితే, పనివేళల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అదే పనిగా ఫోన్‌ వాడడంపై అంభ్యంతరం వ్యక్తం చేసింది మద్రాస్‌ హైకోర్టు.. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయ వేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు..

Read Also: KCR: డబుల్ ఇంజన్‌ కాదు.. అది ట్రబుల్‌ ఇంజన్.. కేసీఆర్‌ కౌంటర్

Also Read

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే...
  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
  • Modi-Trump: బెంగాల్‌లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
  • Rahul Gandhi: బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్‌గాంధీ ఫైర్.. ఏం జరిగిందంటే..!

ఈ విషయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణియన్‌ ఆదేశాలు జారీ చేశారు.. దీనిపై వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని, రూల్స్‌ ఫాలో కానీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.. ఆఫీసు వేళల్లో పబ్లిక్ సర్వెంట్లు మొబైల్ ఫోన్లు వాడడం ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారిందన్నారు జస్టిస్ ఎస్ ఎం సుబ్రమణ్యం… కార్యాలయం లోపల మొబైల్ ఫోన్లు ఉపయోగించడం లేదా వీడియోలు తీయడం దారుణమైన విషయంగా పేర్కొన్నారు.. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు తమ వ్యక్తిగత అవసరాల కోసం కార్యాలయంలో మొబైల్ ఫోన్‌లను ఉపయోగించకూడదన్నారు. ఏదైనా అత్యవసర కాల్‌కు హాజరు కావాలంటే, మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడానికి కార్యాలయం నుండి బయటకు వెళ్లడానికి ఉన్నతాధికారుల నుండి సరైన అనుమతి పొందాలని స్పష్టం చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించే సమయంలో మొబైల్ ఫోన్‌లు సాధారణ క్లోక్‌రూమ్‌లో ఉండేలా చూసుకోవడానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తగిన సర్క్యులర్ / సూచనలు ఇవ్వాలని.. అత్యవసర కాల్స్ కోసం, కార్యాలయంలో ఉంచిన అధికారిక నంబర్లను ఉపయోగించాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు న్యాయమూర్తి.

ఎట్టి పరిస్థితుల్లోనూ, కార్యాలయానికి హాజరయ్యే ప్రజలకు, అలాగే కార్యాలయంలో పనిచేసే ఇతర అధికారుల విధులకు ఇబ్బంది కలిగించకుండా మొబైల్ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాలని లేదా వైబ్రేషన్ / సైలెంట్ మోడ్‌లో ఉంచాలని.. ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస క్రమశిక్షణ పాటించాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కార్యాలయ సమయంలో కార్యాలయ ఆవరణలో మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ కెమెరాల వినియోగాన్ని నియంత్రించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులందరికీ తగిన సర్క్యులర్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇక, అలాంటి మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమాలు, 1973 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది హైకోర్టు. తిరుచ్చి జిల్లాలోని ప్రాంతీయ వర్క్‌షాప్ లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డీఎస్ రాధిక తన సస్పెన్షన్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు.. ఈ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా, పిటిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది మరియు ఇతర ఉద్యోగులను వీడియో తీస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions