PM Modi: ‘‘మాట పదిలం’’.. ఎన్డీయే నాయకులకు ప్రధాని కీలక సలహా..
- ‘‘మాట పదిలం’’, ఎన్డీయే నేతలకు ప్రధాని సూచన..
- వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హితవు..
- ఇటీవల వివాదాల నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి కీలక వ్యాఖ్యలు..
PM Modi: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో ఎన్డీయే ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేడీ నడ్డా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీయే నాయకులకు ప్రధాని నరేంద్రమోడీ కీలక సూచనల చేశారని తెలుస్తోంది. నాయకులు బహిరంగ ప్రకటనలు చేసే సమయంలో సంయమనం పాటించాలని కోరారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
పార్టీ నాయకులు చేసే అనవసరమైన ప్రకటనలపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారని, విచక్షణారహిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని వారిని కోరినట్లు తెలుస్తోంది. ‘‘ఎక్కడైనా ఏదైనా మాట్లాడటం మానుకోవాలి’’ అని, క్షమశిక్షణతో కూడిన సంభాషణ అవసరమని ప్రధాని మోడీ చెప్పారు. మధ్యప్రదేశ్, హర్యానాకు చెందిన బీజేపీ నేతలు ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి ఈ సలహా వచ్చింది. “ఆపరేషన్ సిందూర్” అంశంపై, ఏ మూడవ పక్షం ప్రమేయం లేదని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంలకు ఆయన తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో మీడియా సమావేశాలకు ప్రాతినిధ్యం వహించిన కల్నర్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత, ఎమ్మెల్యే విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విజయ్ షా మాట్లాడుతూ…ఆపరేషన్ సిందూర్లో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి సమాజం నుంచే ఒక సోదరిని పంపామని చెప్పడం వివాదంగా మారింది. ఇదే విధంగా, మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పాదాలకు సాయుధ దళాలు నమస్కరించాలని చెప్పడం కూడా వివాదంగా మారింది.
తాజావార్తలు
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!