Kiren Rijiju: మిస్ ఇండియాలో దళితులు లేరు.. రాహుల్ గాంధీవి ‘‘బాల బుద్ధి’’ వ్యాఖ్యలు..
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్ ఆయనవి ‘‘బాల బుద్ధి’’ వ్యాఖ్యలు..
- ఆయన రాష్ట్రపతి.. ప్రధానిని చూడటం లేదు..
- ‘‘దళితులు మిస్ ఇండియాలో లేరు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: ‘‘మిస్ ఇండియా’’ పోటీల్లో దళితులు, ఆదివాసీలు లేరంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కేవలం ‘‘బాల బుద్ధి’’ నుంచి మాత్రమే వస్తాయని ఆయన అన్నారు. కులగణనను డిమాండ్ చేస్తూ ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరిగిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. 90 శాతం జనాభా భాగస్వామ్యం లేకుండా భారతదేశం సరిగా పనిచేయదని శనివారం అన్నారు. దళిత, ఆదివాసీ(గిరిజన), ఓబీసీ మహిళలు లేని మిస్ ఇండియా జాబితాను తాను చూశానని అన్నారు. కొందరు క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడుతారు, కానీ ఎవరూ చెప్పులు కుట్టేవారు గురించి మాట్లాడరని అన్నారు. మీడియాలో యాంకర్లలో కూడా 90 శాతం మంది లేరని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Hyderabad Ponds: 18 చోట్ల కూల్చివేతలు.. 43 ఎకరాల ప్రభుత్వ భూమి రికవరీ! ప్రముఖుల లిస్ట్ ఇదే
Also Read
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు స్పందిస్తూ.. దేశానికి ద్రౌపది ముర్ము గిరిజనురాలైన మొదటి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఓబీసీకి చెందినవారు, అనేక మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కేబినెట్ మంత్రులుగా ఉన్నారని అన్నారు. ‘‘ రాహుల్ గాంధీ మిస్ ఇండియా పోటీలు, చలనచిత్రాలు, క్రీడలలో రిజర్వేషన్లు కోరుకుంటున్నాడు! ఇది ‘బాలక్ బుద్ధి’ సమస్య మాత్రమే కాదు, అతనిని ఉత్సాహపరిచే వ్యక్తులు కూడా అంతే బాధ్యత వహిస్తారు!’’ అని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పిల్లల తెలివితేటలు వినోదానికి మంచివి కావచ్చు, కానీ మీ విభజన వ్యూహాలలో వెనకబడి వర్గాలను ఎగతాళి చేయొద్దు అని సూచించారు.
రాహుల్ గాంధీ జీ, ప్రభుత్వాలు మిస్ ఇండియాని ఎంపిక చేయవు, ప్రభుత్వాలు ఒలింపిక్స్కి క్రీడాకారుల్ని ఎంపిక చేయవు, ప్రభుత్వాలు సినిమాల్లో నటీనటుల్ని ఎంపిక చేయవని అన్నారు. అలాగే, ఐఏఎస్, ఐపీఎష్, ఐఎఫ్ఎష్ వంటి అన్ని టాప్ రిక్రూట్మెంట్లలో రిజర్వేషన్లు మార్చడానికి సుప్రీంకోర్టు అంగీకరించదని రాహుల్ గాంధీనే స్పష్టం చేశారు. అయితే, అతను భారత రాష్ట్రపతిగా గిరిజనురాలు ఉండటం, ప్రధానిగా ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఉండటాన్ని చూడటం లేదు అని అన్నారు.కులగణన డిమాండ్తో రాహుల్ గాంధీ దేశాన్ని విభజించేందుకు డిమాండ్ చేస్తున్నారని బీజేపీ మండిపడుతోంది.
తాజావార్తలు
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!