CM Nitish Kumar: విపక్షాలు అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా… నితీష్ కుమార్ కీలక హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar promises special status to backward states: బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక హామీ ఇచ్చారు. 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ కాకుండా విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన అన్నారు. వచ్యే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది విపక్షాల కూటమే అని ఆయన అన్నారు. ఇటీవల ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో భాగంగా ఢిల్లీలో పర్యటించారు సీఎం నితీష్ కుమార్. ఈ పర్యటనలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఇతర వామపక్ష పార్టీల నేతలను కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు విపక్షాలు అన్నీ కలిసి పోటీ చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Daniel Craig : జేమ్స్ బాండ్ చిత్రానికి మహిళల దర్శకత్వం!
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
బీహార్ ను విడగొట్టి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్ల గత రెండు దశాబ్ధాల నుంచి బీహార్ ఆదాయాన్ని కోల్పోతోందని ఆయన అన్నారు. విలువైన రెవెన్యూ, ఖనిజ సంపదను బీహార్ రాష్ట్రం కోల్పోయిందని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఏ ప్రభుత్వానికైనా కేంద్రంలో మద్దతు ఇస్తామని ప్రకటించారు.
గత నెలలో ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంది. ఎనిమిదోసారి నితీష్ కుమార్ బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఎన్డీయేకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు బీహార్ వెళ్లి సీఎం నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య కూడా బీజేపీని ఎలా అడ్డుకోవాలనే అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది.
బుధవారం గోవాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 8 మంది బీజేపీలో చేరడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. బీజేపీ డబ్బుతో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తోందని విమర్శించారు. గత వారం ఢిల్లీలో పర్యటించిన ఆయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సీపీఐ-ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, ఎన్సిపికి అధినేత శరద్ పవార్తో సహా పలువురు ప్రతిపక్ష నాయకులను కలిశారు.
తాజావార్తలు
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!