PFI: భారత్ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర.. ఎన్ఐఏ రిపోర్టులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PFI conspiracy to make India an Islamic country: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), ఈ సంస్థ నాయకుల ఇళ్లపై రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీలు సోదాలు నిర్వహించి 106 మంది కీలక సభ్యులను అదుపులోకి తీసుకుంది. అయితే తాజాగా ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 మంది రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కోర్టుకు పలు విషయాలను తెలియజేసింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకుని అత్యంత నేరారోపణలు ఉన్నాయని ఎన్ఐఏ పేర్కొంది.
రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపుల్లోకి యువత వెళ్లేలా ప్రోత్సహిస్తోంది ఫీఎఫ్ఐ, లష్కరేతోయిబా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)తో సహా పలు ఉగ్రవాద గ్రూపుల్లో ముస్లిం యువత చేరేలా ప్రోత్సహించినట్లు ఎన్ఐఏ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. జీహాద్ లోభాగంగా భారతదేశంలో ఇస్లామిక్ పాలన స్థాపించడానికి పీఎఫ్ఐ కుట్ర పన్నిందని పేర్కొంది. పీఎఫ్ఐ ప్రభుత్వ విధానాలపై ముస్లిం వర్గాల్లో తప్పుడుగా చెబుతూ.. భారత్ లో అసహనాన్ని వ్యాపిస్తుందని పేర్కొంది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Sitaram Yechury: మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి
ఇతర మతాలు, వర్గాలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. సెప్టెంబర్మ 22న దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించి 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసింది. దాడులు చేసిన సమయంలో ఒక వర్గానికి చెందని ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. పీఎఫ్ఐ సమాజంలో దౌర్జన్యాలు సృష్టించడానికి కుట్ర పన్నిందని ఎన్ఐఏ పేర్కొంది. నిందితుల నుంచి, పీఎఫ్ఐ కార్యాలయాల నుంచి జప్తు చేసిన ఎలక్ట్రానిక్ డివైసెస్ నుంచి సమాచారం రాబట్టేందుకు త్రివేండ్రంలోని సీడీఏసీలో విశ్లేషించాల్సి ఉందని ఎన్ఐఏ పేర్కొంది.
ప్రస్తుతం అరెస్ట్ చేసిన వ్యక్తులపై ఐపీసీ సెక్షన్లతో పాటు యూఏపీఏ చట్టం కింద అనేక కేసులు నమోదు చేసింది ఎన్ఐఏ. అత్యధికంగా కేరళ నుంచి ఎక్కువ అరెస్టులు జరిగాయి. కేరళలో 22 మందిని, మహారాష్ట్ర, కర్ణాటకల్లో 20 మందిని, తమిళనాడులో పది మందిని, అస్సాంలో 9 మందిని, ఉత్తర్ ప్రదేశ్ లో 8 మందిని, ఏపీ నుంచి ఐదుగురిని, మధ్యప్రదేశ్ నుంచి నలుగురిని, పుదుచ్చేరి, ఢిల్లీల నుంచి ముగ్గురు చొప్పున, రాజస్థాన్ నుంచి ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!