PFI: భారత్ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర.. ఎన్ఐఏ రిపోర్టులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PFI conspiracy to make India an Islamic country: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), ఈ సంస్థ నాయకుల ఇళ్లపై రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీలు సోదాలు నిర్వహించి 106 మంది కీలక సభ్యులను అదుపులోకి తీసుకుంది. అయితే తాజాగా ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 మంది రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కోర్టుకు పలు విషయాలను తెలియజేసింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకుని అత్యంత నేరారోపణలు ఉన్నాయని ఎన్ఐఏ పేర్కొంది.
రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపుల్లోకి యువత వెళ్లేలా ప్రోత్సహిస్తోంది ఫీఎఫ్ఐ, లష్కరేతోయిబా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)తో సహా పలు ఉగ్రవాద గ్రూపుల్లో ముస్లిం యువత చేరేలా ప్రోత్సహించినట్లు ఎన్ఐఏ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. జీహాద్ లోభాగంగా భారతదేశంలో ఇస్లామిక్ పాలన స్థాపించడానికి పీఎఫ్ఐ కుట్ర పన్నిందని పేర్కొంది. పీఎఫ్ఐ ప్రభుత్వ విధానాలపై ముస్లిం వర్గాల్లో తప్పుడుగా చెబుతూ.. భారత్ లో అసహనాన్ని వ్యాపిస్తుందని పేర్కొంది.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
Read Also: Sitaram Yechury: మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి
ఇతర మతాలు, వర్గాలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. సెప్టెంబర్మ 22న దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించి 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసింది. దాడులు చేసిన సమయంలో ఒక వర్గానికి చెందని ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. పీఎఫ్ఐ సమాజంలో దౌర్జన్యాలు సృష్టించడానికి కుట్ర పన్నిందని ఎన్ఐఏ పేర్కొంది. నిందితుల నుంచి, పీఎఫ్ఐ కార్యాలయాల నుంచి జప్తు చేసిన ఎలక్ట్రానిక్ డివైసెస్ నుంచి సమాచారం రాబట్టేందుకు త్రివేండ్రంలోని సీడీఏసీలో విశ్లేషించాల్సి ఉందని ఎన్ఐఏ పేర్కొంది.
ప్రస్తుతం అరెస్ట్ చేసిన వ్యక్తులపై ఐపీసీ సెక్షన్లతో పాటు యూఏపీఏ చట్టం కింద అనేక కేసులు నమోదు చేసింది ఎన్ఐఏ. అత్యధికంగా కేరళ నుంచి ఎక్కువ అరెస్టులు జరిగాయి. కేరళలో 22 మందిని, మహారాష్ట్ర, కర్ణాటకల్లో 20 మందిని, తమిళనాడులో పది మందిని, అస్సాంలో 9 మందిని, ఉత్తర్ ప్రదేశ్ లో 8 మందిని, ఏపీ నుంచి ఐదుగురిని, మధ్యప్రదేశ్ నుంచి నలుగురిని, పుదుచ్చేరి, ఢిల్లీల నుంచి ముగ్గురు చొప్పున, రాజస్థాన్ నుంచి ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!