Amit Shah: కొత్త క్రిమినల్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: దేశంలో పాత క్రిమినల్ చట్టాలను సవరిస్తూ .. కొత్త క్రిమినల్ చట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇకపై కొత్త క్రిమినల్ చట్టాలనే అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై అవగాహన కల్పించడంతోపాటు.. పకడ్బందీగా అమలు చేయాలని పోలీసు అధికారులను హోం మంత్రి ఆదేశించారు. రెండు రోజుల పాటు పోలీసు ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్న కొత్త క్రిమినల్ చట్టాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అవసరాలకు అనుగుణంగా వాడుకోవాలని సూచించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) బిల్లు, 2023, భారతీయ నగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) బిల్లు 2023, భారతీయ సక్ష (బీఎస్) బిల్లు 2023 వరుసగా భారతీయ శిక్షాస్మృతి, 1860, క్రిమినల్ ప్రొసీజర్ చట్టం, 1898 మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో మూడు కొత్త కోడ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
Read Also: Viral video : ఓరి నాయనో..ఫొటోకు కాపలాగా పాము.. ఒళ్లు గగూర్పొడిచే సీన్..
Also Read
- Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
పార్లమెంటులో కొత్త క్రిమినల్ చట్టాలను ఆమోదించినందున క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీని కోసం సిద్ధంగా ఉండాలని పోలీసు సూచించారు. దేశంలోని పోలీసు ఉన్నతాధికారులతో ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో అమిత్ షా శనివారం మాట్లాడారు. మూడు క్రిమినల్ కోడ్లు క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను పునరుద్ధరిస్తాయని, వ్యవస్థ భవిష్యత్తు డిమాండ్లను తీర్చడానికి సాంకేతిక ఆధారిత(ఏఐ) పోలీసింగ్ ను ప్రవేశపెట్టడానికి కొత్త చొరవలను సూచిస్తాయని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 750 మందికి పైగా పోలీసు అధికారులు భౌతికంగా.. వర్చువల్ పద్ధతుల్లో ఈ సదస్సులో పాల్గొన్నారు. పౌరులకు సకాలంలో న్యాయం అందించాల్సిన అవసరాన్ని, వారి రాజ్యాంగపరమైన హక్కులకు హామీ ఇచ్చే వ్యవస్థను నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. . దేశ అంతర్గత భద్రతా సమస్యలను ఎదుర్కోవడంలో పోలీసులు తమ విధానంలో కొన్ని మార్చుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. పోలీసింగ్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని నొక్కిచెప్పిన అమిత్ షా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో సాంకేతిక పురోగతిని ప్రస్తావించారు. ఏఐ ను ఒక అవకాశంగా ఆయన అభివర్ణించారు. కృత్రిమ మేధను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. రాబోయే 25 ఏళ్లలో ఇతర దేశాలకు చెందిన వారు భారత్ నుంచి నేర్చుకునేలా ఇండియన్ పోలీసు వ్యవస్థ ఆదర్శంగా ఉండాలని పోలీసులకు సూచించారు.
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
-
Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!