Amit Shah: కొత్త క్రిమినల్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: దేశంలో పాత క్రిమినల్ చట్టాలను సవరిస్తూ .. కొత్త క్రిమినల్ చట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇకపై కొత్త క్రిమినల్ చట్టాలనే అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై అవగాహన కల్పించడంతోపాటు.. పకడ్బందీగా అమలు చేయాలని పోలీసు అధికారులను హోం మంత్రి ఆదేశించారు. రెండు రోజుల పాటు పోలీసు ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్న కొత్త క్రిమినల్ చట్టాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అవసరాలకు అనుగుణంగా వాడుకోవాలని సూచించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) బిల్లు, 2023, భారతీయ నగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) బిల్లు 2023, భారతీయ సక్ష (బీఎస్) బిల్లు 2023 వరుసగా భారతీయ శిక్షాస్మృతి, 1860, క్రిమినల్ ప్రొసీజర్ చట్టం, 1898 మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో మూడు కొత్త కోడ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
Read Also: Viral video : ఓరి నాయనో..ఫొటోకు కాపలాగా పాము.. ఒళ్లు గగూర్పొడిచే సీన్..
Also Read
- TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
- DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
- Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
పార్లమెంటులో కొత్త క్రిమినల్ చట్టాలను ఆమోదించినందున క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీని కోసం సిద్ధంగా ఉండాలని పోలీసు సూచించారు. దేశంలోని పోలీసు ఉన్నతాధికారులతో ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో అమిత్ షా శనివారం మాట్లాడారు. మూడు క్రిమినల్ కోడ్లు క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను పునరుద్ధరిస్తాయని, వ్యవస్థ భవిష్యత్తు డిమాండ్లను తీర్చడానికి సాంకేతిక ఆధారిత(ఏఐ) పోలీసింగ్ ను ప్రవేశపెట్టడానికి కొత్త చొరవలను సూచిస్తాయని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 750 మందికి పైగా పోలీసు అధికారులు భౌతికంగా.. వర్చువల్ పద్ధతుల్లో ఈ సదస్సులో పాల్గొన్నారు. పౌరులకు సకాలంలో న్యాయం అందించాల్సిన అవసరాన్ని, వారి రాజ్యాంగపరమైన హక్కులకు హామీ ఇచ్చే వ్యవస్థను నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. . దేశ అంతర్గత భద్రతా సమస్యలను ఎదుర్కోవడంలో పోలీసులు తమ విధానంలో కొన్ని మార్చుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. పోలీసింగ్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని నొక్కిచెప్పిన అమిత్ షా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో సాంకేతిక పురోగతిని ప్రస్తావించారు. ఏఐ ను ఒక అవకాశంగా ఆయన అభివర్ణించారు. కృత్రిమ మేధను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. రాబోయే 25 ఏళ్లలో ఇతర దేశాలకు చెందిన వారు భారత్ నుంచి నేర్చుకునేలా ఇండియన్ పోలీసు వ్యవస్థ ఆదర్శంగా ఉండాలని పోలీసులకు సూచించారు.
తాజావార్తలు
-
TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
-
Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
-
Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
-
DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!