NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- నీట్ పేపర్ లీక్లో బయాలజీ లెక్చరర్ అరెస్ట్..
- నిన్న కెమిస్ట్రీ టీచర్ను అరెస్ట్ చేసిన సీబీఐ..
- పేపర్ సెట్ చేసిన వారి ద్వారానే లీక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Paper Leak: నీట్-యూజీసీ పేపర్ లీక్లో వరస అరెస్టులు జరుగుతున్నాయి. శుక్రవారం కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిని సీబీఐ అరెస్ట్ చేసింది. శనివారం మరో మహిళా లెక్చరర్ను అధికారులు అరెస్ట్ చేశారు. బోటనీ ఉపాధ్యాయురాలిగా ఉన్న పూణేకు చెందిన మనీషా గురునాథ్ మంధారేను ఢిల్లీలో అరెరస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆమెను ఎక్స్పర్ట్గా నియమించిన తర్వాత, ఆమె పేపర్ తయారీ ప్రక్రియలో పాల్గొన్నట్లు సీబీఐ చెప్పింది. ఈ అరెస్టుతో మొత్తం అరెస్టుల సంఖ్య 9కి చేరింది.
Read Also: Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
Also Read
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
ఇప్పటికే అరెస్టయిన మనీషా వాఘ్మారే ద్వారా మనీషా కొంత మంది నీట్ అభ్యర్థులతో ఏప్రిల్ నెలలోనే సంప్రదింపులు జరిపింది. దీని తర్వాత తన ఇంట్లోనే కోచింగ్ క్లాసులు నిర్వహించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బోటనీ, జువాలజీలో వచ్చే ప్రశ్నల్ని ముందుగానే విద్యార్థులకు చెప్పి, తప్పకుండా ఇవే పరీక్షలో వస్తాయని వారితో ప్రాక్టీస్ చేయించినట్లు అధికారులు వెల్లడించారు. మే 3న పరీక్షలో వచ్చిన ప్రశ్నలు దాదాపుగా మనీషా లీక్ చేసిన ప్రశ్నలతో సరిపోలినట్లు తేలింది.
ఈ పేపర్ లీక్లో కులకర్ణి తర్వాత ఇప్పుడు మరో లెక్చరర్ అరెస్ట్ అయ్యారు. కులకర్ణి కూడా ఇలాగే కెమిస్ట్రీ ప్రశ్నలను ముందుగానే విద్యార్థులకు లీక్ చేశారు. తన ఇంట్లోనే కోచింగ్ నిర్వహించి విద్యార్థులకు ఇవే ప్రశ్నలు వస్తాయని చెప్పారు. గత 24 గంటల్లో సీబీఐ దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సీబీఐ, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, అహిల్యానగర్ ప్రాంతాలకు చెందిన నిందితులు ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!