NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- నీట్ పేపర్ లీక్లో బయాలజీ లెక్చరర్ అరెస్ట్..
- నిన్న కెమిస్ట్రీ టీచర్ను అరెస్ట్ చేసిన సీబీఐ..
- పేపర్ సెట్ చేసిన వారి ద్వారానే లీక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Paper Leak: నీట్-యూజీసీ పేపర్ లీక్లో వరస అరెస్టులు జరుగుతున్నాయి. శుక్రవారం కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిని సీబీఐ అరెస్ట్ చేసింది. శనివారం మరో మహిళా లెక్చరర్ను అధికారులు అరెస్ట్ చేశారు. బోటనీ ఉపాధ్యాయురాలిగా ఉన్న పూణేకు చెందిన మనీషా గురునాథ్ మంధారేను ఢిల్లీలో అరెరస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆమెను ఎక్స్పర్ట్గా నియమించిన తర్వాత, ఆమె పేపర్ తయారీ ప్రక్రియలో పాల్గొన్నట్లు సీబీఐ చెప్పింది. ఈ అరెస్టుతో మొత్తం అరెస్టుల సంఖ్య 9కి చేరింది.
Read Also: Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
Also Read
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
ఇప్పటికే అరెస్టయిన మనీషా వాఘ్మారే ద్వారా మనీషా కొంత మంది నీట్ అభ్యర్థులతో ఏప్రిల్ నెలలోనే సంప్రదింపులు జరిపింది. దీని తర్వాత తన ఇంట్లోనే కోచింగ్ క్లాసులు నిర్వహించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బోటనీ, జువాలజీలో వచ్చే ప్రశ్నల్ని ముందుగానే విద్యార్థులకు చెప్పి, తప్పకుండా ఇవే పరీక్షలో వస్తాయని వారితో ప్రాక్టీస్ చేయించినట్లు అధికారులు వెల్లడించారు. మే 3న పరీక్షలో వచ్చిన ప్రశ్నలు దాదాపుగా మనీషా లీక్ చేసిన ప్రశ్నలతో సరిపోలినట్లు తేలింది.
ఈ పేపర్ లీక్లో కులకర్ణి తర్వాత ఇప్పుడు మరో లెక్చరర్ అరెస్ట్ అయ్యారు. కులకర్ణి కూడా ఇలాగే కెమిస్ట్రీ ప్రశ్నలను ముందుగానే విద్యార్థులకు లీక్ చేశారు. తన ఇంట్లోనే కోచింగ్ నిర్వహించి విద్యార్థులకు ఇవే ప్రశ్నలు వస్తాయని చెప్పారు. గత 24 గంటల్లో సీబీఐ దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సీబీఐ, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, అహిల్యానగర్ ప్రాంతాలకు చెందిన నిందితులు ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!