Nagpur: గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్.. గ్యాంగ్ మెంబర్ని చంపేందుకు రంగంలోకి 40 మంది..
- గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్..
- గ్యాంగ్ మెంబర్ని చంపేందుకు రంగంలోకి 40 మంది..
- సీక్రేట్గా బయటకు వెళ్లిన సమయంలో మహిళ మృతి..
- ద్రోహం చేసినందుకు హత్యకు ప్లాన్..
Nagpur: నాగ్పూర్లో అత్యంత దారుణమైన గ్యాంగ్ ‘‘ఇప్పా గ్యాంగ్’’. ఈ గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు ఓ గ్యాంగ్ మెంబర్. ఇంకేముంది, తన లీడర్నే మోసం చేసిన వ్యక్తిని చంపేందుకు ఏకంగా 40 మంది కరడుగట్టిన హంతకముంఠా అతడి కోసం వెతుకుతోంది. సదరు మహిళ, తాను ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తితో బయటకు వెళ్లిన సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం ముఠా ఆగ్రహాన్ని మరింత పెంచింది.
ప్రస్తుతం, ఇప్పా గ్యాంగ్లోని 40 మంది నగరం, కాంప్టీ శివారు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. తమ లీడర్ భార్యతో రహస్యంగా సంబంధాన్ని కలిగి ఉన్న అర్షద్ టోపి అనే వ్యక్తిని చంపాలని నిర్ణయించుకున్నారు. గురువారం, టోపీ సదరు మహిళతో ప్రైవేట్ మీటింగ్కి వెళ్లినప్పుడు, బైక్పై ప్రయాణిస్తున్న వీరిని జేడీబీ ఢీకొట్టింది. టోపీ స్వల్పగాయాలతో తప్పించుకోగా, మహిళ తీవ్రంగా గాయపడింది.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
Read Also: Serial killer: డ్రైవర్లను టార్గెట్ చేస్తూ చంపే సీరియల్ కిల్లర్.. 24 ఏళ్ల తర్వాత అరెస్ట్..
కోరాడి థర్మల్ ప్లాంట్కు చెందిన పెట్రోలింగ్ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది, అక్కడ ఆమెకు చికిత్స చేయడానికి నిరాకరించారు. ఆమెను కాంప్టీలోని మరో ఆసుపత్రికి తరలించారు, కానీ అక్కడ కూడా ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు. టోపి అంబులెన్స్ డ్రైవర్కు డబ్బు చెల్లించిన తర్వాతే ఆ మహిళను నాగ్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల – ఆసుపత్రి (GMCH)లో చేర్చారు, అక్కడ ఆమె శుక్రవారం ఉదయం గాయాలతో మరణించింది.
ఈ వార్త నగరంలో వ్యాపించింది. ఇప్పా గ్యాంగ్ టోపీని ద్రోహిగా ప్రకటించి, అతడిని చంపేయాలని ప్రతిజ్ఞ చేసిందని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. తమ గ్యాంగ్ లీడర్ భార్యను టోపీనే హత్య చేసి ఉండవచ్చని, ప్రమాదంతో ఆమె చనిపోలేదని గ్యాంగ్ నమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. లీడర్కి జరిగిన ద్రోహం, ఆయన భార్య మరణానికి ప్రతీకారంగా టోపీని చంపాలని గ్యాంగ్ నిర్ణయించుకుని పెద్ద ఎత్తున వేట కొనసాగిస్తోంది.
అయితే, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించిన టోపీ, శుక్రవారం తనకు రక్షణ కల్పించాలని పార్డిలోని డీసీపీ కార్యాలయానికి వెళ్లాడు. డీసీపీ అతడిని కొరాడి పోలీస్ స్టేషన్ పంపారు. అక్కడే అతడి వాంగ్మూలం నమోదు చేశారు. మహిళ ప్రమాదంలో చనిపోయిందని, హత్యకు గురైనట్లు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?