Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- ముంబైలో దారుణం
- కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి
- నిందితుడి బ్యాగ్రౌండ్పై బృందాలు దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో దారుణం జరిగింది. ఓ దుండగుడు కత్తితో రెచ్చిపోయాడు. ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మతం అడిగి.. కల్మా పఠించమని అడిగాడు. చెప్పకపోవడంతో కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనతో బాధితులు బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. నయా నగర్ ప్రాంతంలో నివసిస్తున్న జైబ్ జుబేర్ అన్సారీ(31) సోమవారం తెల్లవారుజామున బిల్డింగ్ నిర్మాణ ప్రాంతంలో రాజ్కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్ అనే ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. ఇంతలో అన్సారీ అక్కడికి వచ్చి మతం అడిగి.. అనంతరం కల్మా పఠించమని అడిగాడు. వారు చెప్పకపోవడంతో వెంటనే కత్తి తీసుకుని దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులు తీవ్రంగా గాయపడ్డారు. మిశ్రా స్వయంగా ఆస్పత్రికి వెళ్లగా.. సేన్ మాత్రం స్థానిక వ్యక్తి నయాబ్ షేక్ సాయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి.. అక్కడ నుంచి ఆస్పత్రికి వెళ్లాడు.
Also Read
- Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
- Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
- IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
- PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 90 నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై హత్యాయత్నం కేసుతో పాటు రెండు వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొట్టాడన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు. థానే కోర్టులో హాజరుపరచగా మే 4 వరకు పోలీస్ కస్టడీ విధించింది.
అయితే ఈ ఘటన వెనుక ఏవైనా ఉద్దేశాలు ఉన్నాయా? లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కేసును పోలీసులు, రాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS) సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అతని నోట్స్లో ‘ఐసిస్’, ‘లోన్ వుల్ఫ్’, ‘జిహాద్’, ‘గాజా’ వంటి పదాలు కనిపించినట్లు తెలుస్తోంది.
అన్సారీ కొంతకాలం అమెరికాలో నివసించినట్లు సమాచారం. వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ అక్కడనే ఉన్నారు. అక్కడ ఉద్యోగం దొరకకపోవడంతో భారత్కు తిరిగి వచ్చి.. మిరా రోడ్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తూ ఆన్లైన్ ద్వారా కెమిస్ట్రీ క్లాసులు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆన్లైన్ ద్వారా తీవ్రవాద భావజాలానికి లోనైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇక అపోహలు నమ్మొద్దని.. తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!