Mumbai 26/11 attack: భారత్కి అప్పగింతను వ్యతిరేకిస్తూ, యూఎస్ సుప్రీంకోర్టుకు ఉగ్రవాది రానా..
- అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ముంబై దాడుల ఉగ్రవాది..
- భారత్కి తన అప్పగింతని నిలిపేయాలని రాణా పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai 26/11 attack: 2008 ముంబై 26/11 ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న ఉగ్రవాది, పాకిస్తాన్ కెనడియన్ అయిన తహవ్వూర్ రాణా అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. భారత్కి తనను అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం తలుపుతట్టాడు. కింది కోర్టులు రాణాని భారత్కి అప్పగించాలని తీర్పు చెప్పాయి. ముంబై ఉగ్రదాడిలో రాణా ప్రమేయం ఉందని, అతడిని తమకు అప్పటించాలని భారత్ అమెరికాని కోరింది. దిగువ కోర్టులు మరియు అనేక ఫెడరల్ కోర్టులలో జరిగిన న్యాయ పోరాటంలో ఓడిపోయిన తర్వాత రానా చివరిసారిగా శాన్ ఫ్రాన్సిస్కోలోని నార్త్ సర్క్యూట్ కోసం US కోర్ట్ ఆఫ్ అప్పీల్స్కు చేరుకున్నాడు.
Read Also: Maharashtra Elections 2024: మహాయుతి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం..
Also Read
సెప్టెంబర్ 23న, రాణానికి భారత్కి అప్పగించేందుకు అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయంపై కింది కోర్టులు స్టే విధించడాన్ని తోసిపుచ్చాయి. నవంబర్ 13న రాణా యూఎస్ సుప్రీంకోర్టులో ‘‘రిట్ ఆఫ్ సిర్టియోరారీ పిటిషన్’’ దాఖలు చేశాడు. రాణాకు ఇదే చివరి అవకాశం ఒకవేళ సుప్రీంకోర్టు అతడి పిటిషన్కి కొట్టేస్తే భారత్కి అప్పగించాల్సిందే.
రానా 26/11 ముంబై ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్-అమెరికన్, లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకి సంబంధం కలిగి ఉన్నాడు. 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు 60 గంటల పాటు ముంబై నగరంలో నరమేధం సృష్టించారు. ఈ దాడిలో 166 మంది మరణించారు. మరణించిన వారిలో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. ఈ దాడిలో అజ్మల్ కసబ్ మినహా అందరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. కసబ్ని మన దేశ న్యాయస్థానాల తీర్పు మేరకు ఉరితీసి శిక్ష అమలు చేశారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!