Monkeypox: కేరళలో 20 మంది క్వారంటైన్.. మరణించిన వ్యక్తితో సంబంధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
monkeypox in kerala, 20 people Quarantined: మంకీపాక్స్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటీవల కాలంలో వరసగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే స్పెయిన్ లో మంకీపాక్స్ వల్ల ఇద్దరు చనిపోయారు. ఇదిలా ఉంటే ఇండియాలో ఇప్పటికే నలుగురికి మంకీపాక్స్ వ్యాధి సోకింది. కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత మంకీపాక్స్ వ్యాధికి గురయ్యారు. ఇందులో 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ తో మరణించడం అందరిలోనూ కలవరానికి గురిచేస్తోంది. కేరళకు ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ గుర్తించారు. అయితే చికిత్స తీసుకుంటున్న క్రమంలో త్రిసూర్ లో అతడు మరణించాడు. త్రిస్సూర్ జిల్లాలోని చావక్కల్ కురంజియూర్ కు చెందిన యువకుడికి ఇటీవల మంకీపాక్స్ పాజిటివ్ గా తేలింది. అయితే అతడు మంకీపాక్స్ తో పాటు మెదడు వాపు కారణంగా మరణించినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
తాజాగా మరణించిన వ్యక్తితో సంబంధం ఉన్న 20 మందిని క్వారంటైన్ చేశారు అధికారులు. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు అతని స్నేహితుల 10 మందితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 20 మందిని క్వారంటైన్ చేశారు అధికారులు. త్రిస్సూర్ జిల్లాలోని పున్నయూర్ గ్రామంలోని పంచాయతీ సభ్యులు కూడా ఓ సమావేశాన్ని నిర్వహించి బాధిత వ్యక్తి మరణించిన తర్వాత చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. ప్రస్తుతం మరణించిన వ్యక్తి కాంటాక్ట్స్ వెతికే పనిలో పడ్డారు అధికారులు. కాంటాక్ట్ వ్యక్తులు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు.
Also Read
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
ఇదిలా ఉంటే ఇండియాలో మంకీపాక్స్ తొలి మరణం సంభవించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజలు భయాందోళనకు గురికావద్దని అన్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏదైనా లక్షణం కనిపిస్తే సకాలంలో తెలియజేయాలని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని 78 దేశాల్లో 18 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. సరైన క్రమంలో వ్యాధిని గుర్తించి, చికిత్స తీసుకుంటే వ్యాధి ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
-
CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!