Modi-Meloni: హైలెట్‌గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్

  • హైలెట్‌గా ఇటలీ టూర్
  • మోడీ-మెలోని కెమిస్ట్రీ హాట్ టాపిక్‌
  • మోడీ-మెలోని ఫొటోలు వైరల్
Modi1

Modi1

ప్రధాని మోడీ ఇటలీ పర్యటన ప్రపంచ వ్యాప్తంగా హైలెట్‌గా నిలిచింది. ఇటలీ ప్రధాని మెలోని-మోడీ మధ్య సాన్నిహిత్యం చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మంగళవారం రాత్రి ప్రధాని మోడీ రోమ్ నగరంలో ల్యాండ్ అయిన వెంటనే.. జార్జియా మెలోని ఆయనకు గ్రాండ్ డిన్నర్ హోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రోమ్ నగరానికి గర్వకారణమైన ఐకానిక్ కొలోసియం మానిమెంట్ దగ్గర కాసేపు సరదాగా నడుస్తూ డిస్కషన్స్ జరిపారు.

ఈ క్రమంలోనే ప్రధాని మోడీతో దిగిన ఒక బ్యూటిఫుల్ సెల్ఫీని మెలోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “వెల్‌కమ్ టు రోమ్, మై ఫ్రెండ్!” అని క్యాప్షన్ పెట్టారు. అంతే.. ఆ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఏకంగా 3.2 మిలియన్ అంటే 32 లక్షలకు పైగా వ్యూస్, లక్షన్నర కంటే ఎక్కువ లైక్స్‌తో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది.

ఇక ఓ చిన్న సరదా సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ప్రధాని మోడీ చిరునవ్వుతో మెలోనీకి ‘మెలోడీ’ టాఫీల ప్యాక్‌ను అందజేస్తూ కనిపించారు. మెలోనీ కూడా నవ్వుతూ ఆ గిఫ్ట్‌ను స్వీకరించారు. ఈ వీడియోలో ఇద్దరు నాయకుల మధ్య కనిపించిన స్నేహపూర్వక అనుబంధం నెటిజన్లను ఆకట్టుకుంది. కేవలం కొన్ని గంటల్లోనే 10 కోట్ల వ్యూస్ దాటింది. ప్రస్తుతం ఈ వీడియో సరికొత్త రికార్డుగా దిశగా వెళ్తోంది.

ఈ టూర్‌లో వీరిద్దరి మధ్య సరికొత్త ‘కార్ డిప్లొమసీ’ కూడా కనిపించింది. ప్రధాని మోడీ, మెలోని ఇద్దరూ ఒకే కారులో పక్కపక్కన కూర్చుని ఉన్న ఫొటోను మోడీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “రోమ్‌లో ల్యాండ్ అయిన తర్వాత ప్రధాని మెలోనితో కలిసి డిన్నర్ చేశాను.. ఆపై ఐకానిక్ కొలోసియం విజిట్ చేసే ఛాన్స్ దక్కింది. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలపై మేమిద్దరం డిస్కస్ చేశాం. ఇండియా-ఇటలీ ఫ్రెండ్‌షిప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు ఎలా తీసుకెళ్లాలనే దానిపై బుధవారం జరగబోయే అఫీషియల్ బైలాటరల్ టాక్స్ కోసం నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను” అంటూ మోడీ పోస్ట్ పెట్టారు.