Rajnath Singh: ‘‘ప్రధాని గురించి మీరందరికి తెలుసు’’ యుద్ధంపై రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
- ‘‘ప్రధాని మోడీ గురించి మీకు అందరికి తెలుసు’’..
- పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రతీకారం తప్పక ఉంటుంది..
- రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: 26 మంది ప్రాణాలను బలితీసుకున్న ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’తో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ దాడి వెనక పాక్కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో పాటు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారతీయులు కోరుకుంటున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్పై దౌత్య చర్యలు, ఆర్థిక చర్యలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సైనిక చర్యలు కూడా ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వరసగా ప్రధాని మోడీ, టాప్ మినిస్టర్స్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Read Also: Mangoes: ఇలాంటి మామిడి పండ్లు తింటున్నారా? మీకు క్యాన్సర్ ముప్పు తప్పదు?
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్పింగ్.. బ్రిక్స్పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని దెబ్బతీసే ధైర్యం చేసిన వారికి తగిన సమాధానం ఇవ్వడం తన బాధ్యత అని రక్షణ మంత్రి ఆదివారం అన్నారు. రాజ్నాథ్కి ముందు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు కూడా ఉగ్రవాదులను వెతికి మరి మట్టుపెడతాం అని చెప్పారు. “ఈ సంఘటనకు పాల్పడిన వారిని మాత్రమే కాకుండా, భారత గడ్డపై ఇటువంటి దుర్మార్గపు చర్యలకు కుట్ర పన్నిన వారిని కూడా మేము చేరుకుంటాము” అని రాజ్నాథ్ షింగ్ అన్నారు.
‘‘మన దేశంపై దాడి చేయడానికి ధైర్యం చేసే వారికి తగిన సమాధానం ఇవ్వడం నా బాధ్యత. ప్రధాని నరేంద్రమోడీ పనితీరు, పట్టుదల మీ అందరికి తెలుసు’’ అని రక్షణ మంత్రి అన్నారు. ఈ వారం ప్రారంభంలో, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు చర్యలు తీసుకోవడానికి ప్రధాని పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. 2016 ఉరి ఉగ్రవాద దాడి, 2019 పుల్వామా దాడికి ప్రతిస్పందనగా భారతదేశం వరుసగా సర్జికల్ స్ట్రైక్స్ మరియు బాలాకోట్ వైమానిక దాడులను నిర్వహించింది. ఈసారి మోడీ ప్రభుత్వం ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందా..? అని భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#WATCH | Delhi | While addressing the Sanskriti Jagran Mahotsav, Defence Minister Rajnath Singh says, "You all know Prime Minister Narendra Modi's work ethic and perseverance… You are aware of his efficiency & determination… You are aware of the way he has learnt to take… pic.twitter.com/uEHyf7Uea6
— ANI (@ANI) May 4, 2025
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!