Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
- మిషన్ 2029కి మోడీకి సన్నాహాలు
- ప్రభుత్వంలోనూ.. పార్టీలోనూ కీలక మార్పులకు ఛాన్స్
- త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు కేంద్రం వంతు వచ్చింది. మిషన్ 2029కి ఇప్పటి నుంచే మోడీ సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలోనూ.. పార్టీలోనూ కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. 2029లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారీ మార్పులు జరగవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈనెల 26తో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ను విస్తరించాలని భావిస్తున్నారు. మోడీ తన మొదటి, రెండవ పర్యాయాల్లో మంత్రివర్గాన్ని క్రమం తప్పకుండా విస్తరించారు. ప్రస్తుత మంత్రివర్గంలో 72 మంది సభ్యులు ఉండగా.. గరిష్టంగా 81 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారు.
Also Read
- Vladimir Putin: "రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు".. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
- Sergio Gor: మణిపూర్లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
ఇక ఇటీవల బీహార్, ఉత్తరప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా తమ మంత్రివర్గాలను విస్తరించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తన బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది.
గత రెండు పర్యాయాలను పరిశీలిస్తే.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల తర్వాత నవంబర్ 2014లో మోడీ తన మంత్రివర్గాన్ని తొలిసారిగా విస్తరించారు. సుమారు ఏడాదిన్నర తర్వాత జూలై 2016లో రెండవ విస్తరణ జరిగింది. సెప్టెంబర్ 2017లో జరిగిన మొదటి పర్యాయపు చివరి విస్తరణలో పలువురు మంత్రులకు పదోన్నతి లభించింది. ఇక రెండవ పర్యాయంలో ప్రభుత్వం ఏర్పడిన దాదాపు రెండేళ్ల తర్వాత జూలై 2021లో మంత్రివర్గాన్ని తొలిసారిగా విస్తరించారు. మే 2023లో పోర్ట్ఫోలియోల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇక మోడీ జూన్ 9, 2024న మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు రెండేళ్లు పూర్తికాబోతున్నాయి. ఫలితంగా మళ్లీ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో 72 మంది సభ్యులు ఉండగా.. గరిష్టంగా 81 మంది మంత్రులను నియమించవచ్చు. కొంతమంది కొత్తవారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. వారి పనితీరు ఆధారంగా కొంతమంది ప్రస్తుత మంత్రులను తొలగించాలనే చర్చ కూడా జరుగుతోంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా ప్రాంతీయ, కుల సమతుల్యత సాధించబడుతుందని భావిస్తున్నారు. ఒకవేళ విస్తరణ జరిగితే బీహార్ నుంచి ప్రాధాన్యత దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక బీజేపీ వర్గాల సమాచారం మేరకు.. పలువురు కొత్త ముఖాలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించే అవకాశం కూడా ఉంది. యువ అధ్యక్షుడు నితిన్ నబిన్తో సమన్వయం కొనసాగించేందుకు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయికి తీసుకువస్తారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
-
Nivin Pauly : మలయాళం ఆల్టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
-
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్లైన్కు నష్టం!
-
Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?