Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
- మిషన్ 2029కి మోడీకి సన్నాహాలు
- ప్రభుత్వంలోనూ.. పార్టీలోనూ కీలక మార్పులకు ఛాన్స్
- త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు కేంద్రం వంతు వచ్చింది. మిషన్ 2029కి ఇప్పటి నుంచే మోడీ సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలోనూ.. పార్టీలోనూ కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. 2029లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారీ మార్పులు జరగవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈనెల 26తో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ను విస్తరించాలని భావిస్తున్నారు. మోడీ తన మొదటి, రెండవ పర్యాయాల్లో మంత్రివర్గాన్ని క్రమం తప్పకుండా విస్తరించారు. ప్రస్తుత మంత్రివర్గంలో 72 మంది సభ్యులు ఉండగా.. గరిష్టంగా 81 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారు.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ఇక ఇటీవల బీహార్, ఉత్తరప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా తమ మంత్రివర్గాలను విస్తరించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తన బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది.
గత రెండు పర్యాయాలను పరిశీలిస్తే.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల తర్వాత నవంబర్ 2014లో మోడీ తన మంత్రివర్గాన్ని తొలిసారిగా విస్తరించారు. సుమారు ఏడాదిన్నర తర్వాత జూలై 2016లో రెండవ విస్తరణ జరిగింది. సెప్టెంబర్ 2017లో జరిగిన మొదటి పర్యాయపు చివరి విస్తరణలో పలువురు మంత్రులకు పదోన్నతి లభించింది. ఇక రెండవ పర్యాయంలో ప్రభుత్వం ఏర్పడిన దాదాపు రెండేళ్ల తర్వాత జూలై 2021లో మంత్రివర్గాన్ని తొలిసారిగా విస్తరించారు. మే 2023లో పోర్ట్ఫోలియోల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇక మోడీ జూన్ 9, 2024న మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు రెండేళ్లు పూర్తికాబోతున్నాయి. ఫలితంగా మళ్లీ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో 72 మంది సభ్యులు ఉండగా.. గరిష్టంగా 81 మంది మంత్రులను నియమించవచ్చు. కొంతమంది కొత్తవారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. వారి పనితీరు ఆధారంగా కొంతమంది ప్రస్తుత మంత్రులను తొలగించాలనే చర్చ కూడా జరుగుతోంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా ప్రాంతీయ, కుల సమతుల్యత సాధించబడుతుందని భావిస్తున్నారు. ఒకవేళ విస్తరణ జరిగితే బీహార్ నుంచి ప్రాధాన్యత దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక బీజేపీ వర్గాల సమాచారం మేరకు.. పలువురు కొత్త ముఖాలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించే అవకాశం కూడా ఉంది. యువ అధ్యక్షుడు నితిన్ నబిన్తో సమన్వయం కొనసాగించేందుకు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయికి తీసుకువస్తారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?