Meghalaya: హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో ట్విస్ట్! అధికారులు ఏం తేల్చారంటే..!
- హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో ట్విస్ట్!
- లోయలో భర్త మృతదేహం లభ్యం!
- కనిపించని భార్య సోనమ్ జాడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేఘాలయలో తప్పిపోయిన హనీమూన్ జంట కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. వారం క్రితం తప్పిపోయిన జంట ఆచూకీలో ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేహంపై ఉన్న గాయాలను చూసి ఇది హత్యకు అధికారులు భావిస్తున్నారు. డెడ్బాడీని పోస్టుమార్టానికి తరలించారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: RCB vs PBKS: వారి కోసమైనా ఐపీఎల్ టైటిల్ సాధిస్తాం.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
మధ్యప్రదేశ్కు చెందిన జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీకి మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. మే 23 నుంచి జంట ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో కనిపించకుండా పోయారు. సమాచారం అందిన దగ్గర నుంచి మేఘాలయ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది జంట కోసం వెతికారు. ప్రతికూల వాతావరణంలో కూడా అధికారులు అన్వేషణ సాగించారు. ఎట్టకేలకు రియాట్ అర్లియాంగ్ దగ్గర లోతైన లోయలో రాజా రఘవంశీ మృతదేహాన్ని డ్రోన్ ద్వారా గుర్తించారు. కానీ భార్య సోనమ్ ఆచూకీ లభించలేదు. దీంతో సోనమ్ ఆచూకీ కోసం కూడా గాలింపు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bhu Bharati Act: నేటి నుంచి ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు
రాజా రఘువంశీ మృతదేహాన్ని వీసావ్డాంగ్ పార్కింగ్ స్థలానికి తీసుకురాగానే కుటుంబ సభ్యులు, బంధువులు.. అతని కుడి చేతిపై ఉన్న ‘రాజా’ అని పేరున్న పచ్చబొట్టు ద్వారా గుర్తించారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అడియెల్ ఆర్. కింటాన్, స్వతంత్ర స్థానిక సాక్షుల సమక్షంలో అక్కడికక్కడే మెజిస్టీరియల్ విచారణ నిర్వహించారు. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం రాజా రఘువంశీ హత్యకు గురైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే భార్య సోనమ్ ఆచూకీ లభించకపోవడంతో మరింత లోతుగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇక మృతదేహం లభించిన స్థలం దగ్గర నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళ తెల్ల చొక్కా.. పెంట్రా 40 మందుల స్ట్రిప్, వివో మొబైల్, ఎల్సీడీ స్క్రీన్ భాగం, స్మార్ట్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పోస్టుమార్టం కోసం ప్రస్తుతం మృతదేహాన్ని షిల్లాంగ్లోని ఆస్పత్రికి తరలించారు. డెడ్బాడీని చూసిన దానిని బట్టి చూస్తే.. కచ్చితంగా రాజా రఘువంశీ హత్యకు గురైనట్లుగానే అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు కోసం అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!