Mining Contract: ఖనిజాల తవ్వకాలు ప్రైవేటుకు.. లోక్సభలో బిల్లు ఆమోదం
Mining Contract: ఖనిజాల తవ్వకాలను ప్రైవేటుకు అప్పగించనున్నారు. అరుదైన, ఖరీదైన పరమాణు ఖనిజాల (అటామిక్ మినరల్స్) అన్వేషణ, తవ్వకాల్లోకి సైతం ప్రైవేటు రంగం ప్రవేశించనుంది. దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ యాజమాన్య సంస్థలు మాత్రమే 12 పరమాణు ఖనిజాల మైనింగ్ను చేపట్టాడానికి వీలుండేది. ఇకపై వీటిలో ఆరు ఖనిజాల వెలికితీతను ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించిన ‘గనులు, ఖనిజాల(అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ బిల్లు-2023ను శుక్రవారం లోక్సభ ఆమోదించింది. మణిపూర్లో శాంతిభద్రతల వైఫల్యంపై విపక్ష సభ్యుల ఆందోళన మధ్య ఈ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
Read also: Rajdhani Express: రాజధాని ఎక్స్ప్రెస్కి బాంబు బెదిరింపు.. తీరా చూస్తే..
Also Read
విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీకి వినియోగించే లిథియంతో పాటు బెరీలియం, నియోబియం, టైటానియం, టాంటలం, జిర్కోనియం ఖనిజాల వెలికితీతను ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు ఈ బిల్లు వీలుకల్పిస్తుంది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, విద్యుత్ బ్యాటరీల తయారీ, అంతరిక్ష రంగ పరిశ్రమ అవసరాలను ఈ ఖనిజాలు తీరుస్తాయని బిల్లు లక్ష్యాల్లో ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వ సంస్థలకు రిజర్వు చేసిన జాబితా నుంచి ఈ ఆరు ఖనిజాల తవ్వకాలను తొలగించి ప్రైవేటు రంగానికి అప్పగించడం ద్వారా దేశంలో వీటి ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని కేంద్రం బిల్లులో పేర్కొంది. భూమి పొరల్లో చాలా లోతుల్లో ఉండే బంగారం, వెండి, రాగి, జింక్, లెడ్, నికెల్, కొబాల్ట్, ప్లాటినం, వజ్రాలు తరహా ఖనిజాల వెలికితీత చాలా కష్టమైన, ఖరీదైన వ్యవహారంగా ఉంటోందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఖనిజాల కోసం కూడా విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని.. వీటి అన్వేషణ, వెలికితీయడంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాల్సి ఉందని అభిప్రాయపడింది. ఇందుకు అవసరమైన అనుమతుల మంజూరును కూడా ప్రభుత్వం ఈ బిల్లులో ప్రతిపాదించింది. ఇప్పటి వరకూ రెండు రకాల లైసెన్సులు(కాంపోజిట్, మైనింగ్) ఇస్తున్నామని, ఇకపై పారదర్శకమైన వేలం విధానంలో ఈ ఖనిజాల తవ్వకాలను అప్పగిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్సభకు తెలిపారు. సముద్ర ఇసుకలో లభించే ఖనిజాల అన్వేషణ, వెలికితీతను ప్రభుత్వ రంగ సంస్థలకే రిజర్వు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది మనదేశం 100 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయనుందని, తద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2025-26 నుంచి థర్మల్ విద్యుత్ కోసం బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని మంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
-
AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో