Operation Sindoor: పాక్పై దాడిలో అసలు విజయం “వైమానిక దళానిదే”: ఐఏఎఫ్ చీఫ్
- పాక్పై దాడిలో వైమానిక దళానిదే కీలక విజయం.. దేశ రక్షణకు ఆర్థిక పరిస్థితి మాత్రమే సరిపోదు, సైన్యం చాలా ముఖ్యం.. డిఫెన్స్ సెమినార్లో వైమానిక దళ చీఫ్ ఏపీ సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: దేశ భద్రతకు కేవలం ఆర్థిక బలమే సరిపోదని, బలమైన సైనిక శక్తి తప్పనిసరి అని భారత వైమానిక దళ చీఫ్(IAF) చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన 22వ సుబ్రతో ముఖర్జీ సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా, పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులను గురించి ప్రస్తావించారు. ఆధునిక యుద్ధాల్లో ‘‘ఎయిర్ పవర్’’ చాలా కీలకమని అన్నారు. పాకిస్తాన్పై దాడుల్లో భారత వైమానిక దళం వేగవంతమైన, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని నిరూపించిందని ఆయన అన్నారు. సిందూర్ సమయంలో భారత వైమానిక దళం పాకిస్తాన్కు స్పష్టమైన సందేశాన్ని పంపిందని ఆయన చెప్పారు.
Read Also: Crime: పెళ్లై 4 నెలలు.. ఇద్దరు వ్యక్తులతో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..
Also Read
సుడాన్లో సంఘర్షణ ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలించడం, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం, శత్రువుల్ని లొంగదీసుకోవడానికి కొన్ని గంటల్లోనే పాకిస్తాన్లోని అనేక స్థావరాలపై దాడి చేయడం వంటివి వైమానిక దళం చేసిందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఇటీవల వెనిజులా, ఇరాక్ పరిస్థితుల్ని ఉదహరిస్తూ.. కేవలం ఆర్థిక బలం మాత్రమే జాతీయ భద్రతకు హామీ ఇవ్వదని, పటిష్టమైన సైన్యం కూడా అవసరమే అని చెప్పారు. దీనికి ఉదాహరణను చెబుతు.. ఒకప్పుడు భారత్, చైనాలు ప్రపంచంలో 60 శాతం జీడీపీపి కలిగి ఉన్నామని, కానీ వలస పాలనలోకి వెళ్లకుండా నిలువరించలేకపోయామని అన్నారు. పటిష్టమైన సైన్యం లేకపోతే మనల్ని ఎవరైనా లొంగదీసుకోవచ్చని, సైనిక శక్తిని ఉపయోగించాలనే సంకల్పం అంతకన్నా ముఖ్యమైందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!