Sonam Raghuvanshi: సోనమ్-రాజ్ కుష్వాహ బంధంపై పోలీసులు ఏం తేల్చారంటే..!
- సోనమ్-రాజ్ కుష్వాహ బంధంపై పోలీసులు క్లారిటీ
- ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీమూన్ మర్డర్ కేసులో మేఘాలయ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇక సోనమ్ రఘువంశీ-రాజ్ కుష్వాహ మధ్య సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఇద్దరు కూడా బంధం ఉన్నట్లు ఒప్పుకున్నారని తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సాయిమ్ తెలిపారు. సోనమ్ రఘువంశీ, రాజ్ కుష్వాహ బంధానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. నార్కో పరీక్షలు నిర్వహించడం లేదని.. బాధిత కుటుంబం డిమాండ్ను అంగీకరించడం లేదని చెప్పారు. ఆధారాలు లేనప్పుడు మాత్రమే నార్కో పరీక్షలు నిర్వహిస్తారని.. అన్ని ఆధారాలు లభించాక ఇంకెందుకు అని ప్రశ్నించారు. నార్కో పరీక్షను సుప్రీం కోర్టు నిషేధించిందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Off The Record: కంటే కూతుర్నే కనాలి అంటారు.. కానీ ఉసురు తీసిన కూతురు
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
నిందితులు నేరాన్ని అంగీకరించడంతో పాటు బలమైన సాక్ష్యాలను కూడా సేకరించినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా ఛార్జిషీట్ను వేస్తామని చెప్పారు. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే రాజా రఘువంశీతో సోనమ్ పెళ్లికి ఒప్పుకుందని తెలిపారు. ఇక నిందితులకు ఇండోర్లో లోకేంద్ర తోమర్ ఫ్లాట్ ఇచ్చాడు. లోకేంద్ర తోమర్ను కూడా విచారించనున్నారు. సోనమ్ అరెస్ట్ కాకముందు ఇండోర్లోని ఫ్లాట్లో ప్రియుడితో ఉందని చెప్పారు. సోనమ్.. ఫ్లాట్లో వదిలేసిన బ్యాగ్లో ఒక దేశీయ పిస్టల్, ఆమె ఫోన్, రాజాకు చెందిన నగలు, రూ.5లక్షల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని లోకేంద్ర తోమర్ ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వాటి కోసం ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Sugavasi Subramanyam: నేడు వైసీపీలో చేరనున్న సీనియర్ నేత.. రాజకీయంగా టీడీపీకి దెబ్బే!
మే 11న రాజా రఘువంశీ-సోనమ్కు వివాహం అయింది. మే 20న మేఘాలయ హనీమూన్కు వచ్చారు. మే 23న ముగ్గురు హంతకులతో కలిసి సోనమ్.. భర్తను చంపి లోయలో పడేసింది. అనంతరం ఇండోర్లో ప్రియుడితో సోనమ్ మకాం పెట్టింది. జూన్ 8న ఘాజీపూర్లో సోనమ్ లొంగిపోయింది. నిందితులంతా నేరాన్ని అంగీకరించారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!