Sonam Raghuvanshi: సోనమ్-రాజ్ కుష్వాహ బంధంపై పోలీసులు ఏం తేల్చారంటే..!
- సోనమ్-రాజ్ కుష్వాహ బంధంపై పోలీసులు క్లారిటీ
- ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీమూన్ మర్డర్ కేసులో మేఘాలయ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇక సోనమ్ రఘువంశీ-రాజ్ కుష్వాహ మధ్య సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఇద్దరు కూడా బంధం ఉన్నట్లు ఒప్పుకున్నారని తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సాయిమ్ తెలిపారు. సోనమ్ రఘువంశీ, రాజ్ కుష్వాహ బంధానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. నార్కో పరీక్షలు నిర్వహించడం లేదని.. బాధిత కుటుంబం డిమాండ్ను అంగీకరించడం లేదని చెప్పారు. ఆధారాలు లేనప్పుడు మాత్రమే నార్కో పరీక్షలు నిర్వహిస్తారని.. అన్ని ఆధారాలు లభించాక ఇంకెందుకు అని ప్రశ్నించారు. నార్కో పరీక్షను సుప్రీం కోర్టు నిషేధించిందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Off The Record: కంటే కూతుర్నే కనాలి అంటారు.. కానీ ఉసురు తీసిన కూతురు
Also Read
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
నిందితులు నేరాన్ని అంగీకరించడంతో పాటు బలమైన సాక్ష్యాలను కూడా సేకరించినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా ఛార్జిషీట్ను వేస్తామని చెప్పారు. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే రాజా రఘువంశీతో సోనమ్ పెళ్లికి ఒప్పుకుందని తెలిపారు. ఇక నిందితులకు ఇండోర్లో లోకేంద్ర తోమర్ ఫ్లాట్ ఇచ్చాడు. లోకేంద్ర తోమర్ను కూడా విచారించనున్నారు. సోనమ్ అరెస్ట్ కాకముందు ఇండోర్లోని ఫ్లాట్లో ప్రియుడితో ఉందని చెప్పారు. సోనమ్.. ఫ్లాట్లో వదిలేసిన బ్యాగ్లో ఒక దేశీయ పిస్టల్, ఆమె ఫోన్, రాజాకు చెందిన నగలు, రూ.5లక్షల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని లోకేంద్ర తోమర్ ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వాటి కోసం ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Sugavasi Subramanyam: నేడు వైసీపీలో చేరనున్న సీనియర్ నేత.. రాజకీయంగా టీడీపీకి దెబ్బే!
మే 11న రాజా రఘువంశీ-సోనమ్కు వివాహం అయింది. మే 20న మేఘాలయ హనీమూన్కు వచ్చారు. మే 23న ముగ్గురు హంతకులతో కలిసి సోనమ్.. భర్తను చంపి లోయలో పడేసింది. అనంతరం ఇండోర్లో ప్రియుడితో సోనమ్ మకాం పెట్టింది. జూన్ 8న ఘాజీపూర్లో సోనమ్ లొంగిపోయింది. నిందితులంతా నేరాన్ని అంగీకరించారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!