కేంద్ర కేబినెట్ విస్తరణ..! ప్రధాని మోడీ కీలక మంతనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు సాగుతున్నాయి.. దీనికి ముఖ్యకారణంగా.. ప్రధాని నివాసంలో కీలక సమాలోచనలు జరగడమే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్షాలు సుదీర్ఘ మంతనాలు జరిపారు.. దీంతో.. ఓ వారం రోజుల్లో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.. గత ఏడాది కాలంగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ పై ఊహాగానాలు కొనసాగుతుండగా.. దేశంలో “కరోనా” విజృంభణ, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఒకటి కి మించి మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు తోమర్, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్, ప్రకాశ్ జావడేకర్ లాంటి కేంద్ర మంత్రులు. దీంతో.. కేంద్ర మంత్రి వర్గంలో “అప్నాదళ్” నేత అనుప్రియ పటేల్, బీహార్ నుంచి బిజేపి నేత సునీల్ మోడి, ఇటీవలే బిజేపి లో చేరిన జ్యోతిరాదిత్య సింధియా, జేడి-యు కి చెందిన ఇరువురు నేతలకు చోటు లభించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
నిన్న సాయంత్రం కూడా పలు మంత్రిత్వశాఖల పనితీరుపై దాదాపు 5 గంటలకు పైగా సమీక్ష జరిగింది.. నిన్నటి సమావేశంలో ఉక్కు, పెట్రోలియం శాఖ, జలశక్తి శాఖ, నైపుణ్యాభివృధ్ది శాఖ, పౌర విమానయాన శాఖ, భారీ పరిశ్రమలు, పర్యావరణ శాఖల పనితీరు పై ఆయా శాఖల మంత్రులతో సమీక్ష నిర్వహించారు ప్రధాని మోడీ.. ఈ రోజు సమావేశంలో కూడా పలువురు మంత్రులు పాల్గొన్నట్టు సమాచారం. ఇది మామూలు గా ప్రతి ఏడాది జరిగే సమీక్ష సమావేశాలేనని అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రధాని మొత్తం 79 కేంద్ర మంత్రులను నియామకం చేసే అవకాశం ఉండగా, ఇంకా రెండు డజన్లు కు పైగా ఖాళీలు ఉన్నాయి.. రెండవ విడత “కరోనా” విజృంభణ ను అడ్డుకోవడంలో ప్రధాని తీవ్ర వైఫల్యం చెందారని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మొదలైన సమీక్ష సమావేశాలు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట ను మెరుగుపరుచుకునేందుకు మరో సరికొత్త కేంద్ర పథకాన్ని అతి త్వరలో ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై కీలక చర్చ సాగినట్టు సమాచారం.. ఢిల్లీకి వెళ్లిన సీఎం యోగి ఆదిత్యానాథ్.. ప్రధాని, అమిత్షా, జేపీ నడ్డాలు కలసి వెళ్లారు.. దీంతో.. ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గంలోనూ మరికొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.. వచ్చే ఫిబ్రవరి లో జరగనున్న యు.పి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర మంత్రి వర్గంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారని సమాచారం.. ఏ క్షణంలో నైనా యు.పి మంత్రివర్గ విస్తరణ జరగనుండగా.. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు.యూపీ బీజేపీలో కూడా సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
- Badrinath Temple: రామ మందిరం తర్వాత బద్రీనాథ్లోనూ దొంగలు..? విరాళాల కాజేత.. విచారణకు ఆదేశం
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- Tags
తాజావార్తలు
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
-
TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
-
BLA: గ్వాదర్ కోస్ట్ గార్డ్ క్యాంప్పై దాడి.. 30 మంది పాకిస్తానీ భద్రతా సిబ్బందిని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటన
-
Keeway Hypvolt-R: భారత్లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లు, 180KM రేంజ్
ట్రెండింగ్
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!