Meerut Murder: భర్తని చంపిన భార్యకు సాయం నిరాకరించిన కుటుంబం.. ప్రభుత్వ లాయర్ కోసం విజ్ఞప్తి
- సంచలనంగా మీరట్ మర్చంట్ నేవీ అధికారి హత్య..
- భార్య, ప్రియుడు కలిసి ప్లాన్ చేసి మర్డర్..
- నిందితురాలికి న్యాయ సాయం అందించని ఆమె కుటుంబం..
- ప్రభుత్వ లాయర్ కోసం అభ్యర్థన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerut Murder: ఉత్తర్ ప్రదేశ్ మీటర్లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ని అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనమైంది. విదేశాల నుంచి కుమార్తె బర్త్ డే కోసం వచ్చిన అతడిని ఇద్దరు కలిసి మత్తు మందు ఇచ్చి, నరికి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని డ్రమ్లో వేసి, సిమెంట్తో కప్పేశారు. మార్చి 04న జరిగిన ఈ ఘటనపై సౌరభ్ కుటుంబీకులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో మార్చి 18న వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇద్దరూ డ్రగ్స్కి బానిసలైనట్లు తెలుస్తోంది. వీరిద్దరిని ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.
Read Also: Mohanlal : లూసీఫర్-2 కోసం మోహన్ లాల్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
ఇదిలా ఉంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్ని ముస్కాన్ అత్యంత దారుణంగా చంపడంపై ముస్కాన్ కుటుంబీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే తమ కూతురుకి జీవించే హక్కు లేదని, మరణశిక్ష విధించాలని ముస్కాన్ పేరెంట్స్ డిమాండ్ చేశారు. ముస్కాన్ రస్తోగికి కుటుంబీకులు న్యాయసాయాన్ని అందించేందుకు నిరాకరించారు. దీంతో ప్రభుత్వమే న్యాయవాదిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మీరట్ జైలులో ఉన్న ముస్కాన్, న్యాయవాదిని కోరుతూ శనివారం జైలు సూపరింటెండెంట్ని అభ్యర్థించింది.
మరోవైపు, సాహిల్ శుక్లా తనకు ప్రభుత్వ న్యాయవాది కావాలా..? వద్దా..? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ మాట్లాడుతూ, ‘‘భద్రతా కారణాల దృష్ట్యా, కొత్త ఖైదీలను మొదట్లో కొత్త ఖైదీల బ్యారక్లో వేరుగా ఉంచుతారు. నిన్న ముస్కాన్ నన్ను కలవాలని కోరింది. నేను ఆమెను కలిసినప్పుడు, ఆమె కుటుంబం కలత చెందిందని, ఆమె కేసును వాదించడం లేదని చెప్పింది. అందువల్ల, ఆమె ప్రభుత్వ న్యాయవాదిని కోరింది.’’ అని చెప్పారు. ప్రతీ ఖైదీకి చట్టపరమైన సాయం పొందే హక్కు ఉంటుంది, ఒక ఖైదీకి ప్రైవేట్ లాయర్ లేకపోతే, అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
తాజావార్తలు
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్ఫ్లిక్స్ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్గా టాప్-3!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..