Meerut Murder: భర్తని చంపిన భార్యకు సాయం నిరాకరించిన కుటుంబం.. ప్రభుత్వ లాయర్ కోసం విజ్ఞప్తి
- సంచలనంగా మీరట్ మర్చంట్ నేవీ అధికారి హత్య..
- భార్య, ప్రియుడు కలిసి ప్లాన్ చేసి మర్డర్..
- నిందితురాలికి న్యాయ సాయం అందించని ఆమె కుటుంబం..
- ప్రభుత్వ లాయర్ కోసం అభ్యర్థన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerut Murder: ఉత్తర్ ప్రదేశ్ మీటర్లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ని అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనమైంది. విదేశాల నుంచి కుమార్తె బర్త్ డే కోసం వచ్చిన అతడిని ఇద్దరు కలిసి మత్తు మందు ఇచ్చి, నరికి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని డ్రమ్లో వేసి, సిమెంట్తో కప్పేశారు. మార్చి 04న జరిగిన ఈ ఘటనపై సౌరభ్ కుటుంబీకులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో మార్చి 18న వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇద్దరూ డ్రగ్స్కి బానిసలైనట్లు తెలుస్తోంది. వీరిద్దరిని ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.
Read Also: Mohanlal : లూసీఫర్-2 కోసం మోహన్ లాల్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?
Also Read
- Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
- PM Modi: "నీట్ పేపర్ లీక్ 'ఘోర పాపం'.. కఠిన శిక్ష తప్పదు".. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
ఇదిలా ఉంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్ని ముస్కాన్ అత్యంత దారుణంగా చంపడంపై ముస్కాన్ కుటుంబీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే తమ కూతురుకి జీవించే హక్కు లేదని, మరణశిక్ష విధించాలని ముస్కాన్ పేరెంట్స్ డిమాండ్ చేశారు. ముస్కాన్ రస్తోగికి కుటుంబీకులు న్యాయసాయాన్ని అందించేందుకు నిరాకరించారు. దీంతో ప్రభుత్వమే న్యాయవాదిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మీరట్ జైలులో ఉన్న ముస్కాన్, న్యాయవాదిని కోరుతూ శనివారం జైలు సూపరింటెండెంట్ని అభ్యర్థించింది.
మరోవైపు, సాహిల్ శుక్లా తనకు ప్రభుత్వ న్యాయవాది కావాలా..? వద్దా..? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ మాట్లాడుతూ, ‘‘భద్రతా కారణాల దృష్ట్యా, కొత్త ఖైదీలను మొదట్లో కొత్త ఖైదీల బ్యారక్లో వేరుగా ఉంచుతారు. నిన్న ముస్కాన్ నన్ను కలవాలని కోరింది. నేను ఆమెను కలిసినప్పుడు, ఆమె కుటుంబం కలత చెందిందని, ఆమె కేసును వాదించడం లేదని చెప్పింది. అందువల్ల, ఆమె ప్రభుత్వ న్యాయవాదిని కోరింది.’’ అని చెప్పారు. ప్రతీ ఖైదీకి చట్టపరమైన సాయం పొందే హక్కు ఉంటుంది, ఒక ఖైదీకి ప్రైవేట్ లాయర్ లేకపోతే, అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
-
Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
-
Balkampet Yellamma: నేడు “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం..!
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!