Meerut Murder: భర్తని చంపిన భార్యకు సాయం నిరాకరించిన కుటుంబం.. ప్రభుత్వ లాయర్ కోసం విజ్ఞప్తి
- సంచలనంగా మీరట్ మర్చంట్ నేవీ అధికారి హత్య..
- భార్య, ప్రియుడు కలిసి ప్లాన్ చేసి మర్డర్..
- నిందితురాలికి న్యాయ సాయం అందించని ఆమె కుటుంబం..
- ప్రభుత్వ లాయర్ కోసం అభ్యర్థన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerut Murder: ఉత్తర్ ప్రదేశ్ మీటర్లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ని అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనమైంది. విదేశాల నుంచి కుమార్తె బర్త్ డే కోసం వచ్చిన అతడిని ఇద్దరు కలిసి మత్తు మందు ఇచ్చి, నరికి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని డ్రమ్లో వేసి, సిమెంట్తో కప్పేశారు. మార్చి 04న జరిగిన ఈ ఘటనపై సౌరభ్ కుటుంబీకులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో మార్చి 18న వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇద్దరూ డ్రగ్స్కి బానిసలైనట్లు తెలుస్తోంది. వీరిద్దరిని ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.
Read Also: Mohanlal : లూసీఫర్-2 కోసం మోహన్ లాల్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?
Also Read
ఇదిలా ఉంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్ని ముస్కాన్ అత్యంత దారుణంగా చంపడంపై ముస్కాన్ కుటుంబీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే తమ కూతురుకి జీవించే హక్కు లేదని, మరణశిక్ష విధించాలని ముస్కాన్ పేరెంట్స్ డిమాండ్ చేశారు. ముస్కాన్ రస్తోగికి కుటుంబీకులు న్యాయసాయాన్ని అందించేందుకు నిరాకరించారు. దీంతో ప్రభుత్వమే న్యాయవాదిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మీరట్ జైలులో ఉన్న ముస్కాన్, న్యాయవాదిని కోరుతూ శనివారం జైలు సూపరింటెండెంట్ని అభ్యర్థించింది.
మరోవైపు, సాహిల్ శుక్లా తనకు ప్రభుత్వ న్యాయవాది కావాలా..? వద్దా..? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ మాట్లాడుతూ, ‘‘భద్రతా కారణాల దృష్ట్యా, కొత్త ఖైదీలను మొదట్లో కొత్త ఖైదీల బ్యారక్లో వేరుగా ఉంచుతారు. నిన్న ముస్కాన్ నన్ను కలవాలని కోరింది. నేను ఆమెను కలిసినప్పుడు, ఆమె కుటుంబం కలత చెందిందని, ఆమె కేసును వాదించడం లేదని చెప్పింది. అందువల్ల, ఆమె ప్రభుత్వ న్యాయవాదిని కోరింది.’’ అని చెప్పారు. ప్రతీ ఖైదీకి చట్టపరమైన సాయం పొందే హక్కు ఉంటుంది, ఒక ఖైదీకి ప్రైవేట్ లాయర్ లేకపోతే, అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!