Masood Azhar: జైష్ చీఫ్ మసూద్ అజర్ను భయపెడుతున్న ‘‘భారత’’ గతం.. జైలు పరారీ విఫలయత్నంపై కామెంట్స్..
- జైష్ చీఫ్ మసూద్ అజర్ను భయపెడుతున్న ‘‘భారత’’ గతం..
- జమ్మూ జైలు పరారీ తర్వాత అధికారుల్ని చూస్తేనే భయం..
- పాక్ బహిరంగం సభలో అజర్ భావోద్వేగ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Masood Azhar: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్కు భారత అధికారులంటే ఎలాంటి భయమో స్వయంగా ఆయనే వెల్లడించాడు. 1990లలో జమ్మూ కాశ్మీర్ జైలులో ఉన్న అజర్, అక్కడి నుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేశారు. దీని తర్వాత తాను తీవ్రమైన ‘‘శిక్ష’’ను ఎదుర్కొన్నానని చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. నిఘా వర్గాలు కూడా ఈ ఆడియో క్లిప్ నిజమైందని నిర్ధారించాయి. పాకిస్తాన్లో జరిగిన ఒక బహిరంగ సభలో అజర్ ప్రసంగిస్తూ, జైలులో ఉన్న అప్పటి గతాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
మసూర్ అజర్ 1994లో నకిలీ గుర్తింపు, పోర్చగీస్ పాస్పోర్ట్ ద్వారా భారత్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచడం,జిహాద్ను ప్రోత్సహించాలని వచ్చాడు. అదే ఏడాది అనంత్నాగ్లో అరెస్ట్ అయ్యాడు. 1994 నుంచి 1999 వరకు జైలు ఉన్నాడు. ఆ సమయంలో జమ్మూ లోని కోట్ భల్వాల్ జైలులో ఉన్నాడు. ఇది కరుగుగట్టిన ఉగ్రవాదుల్ని ఉంచే జైలు. జైలులో దొరికిన కొన్ని పనిముట్లను వాడి సొరంగం తవ్వి పారిపోవాలనే పథకాన్ని వేశాడు. కానీ తప్పించుకోవాలని నిర్ణయించుకున్న రోజే జైలు అధికారులు సొరంగాన్ని గుర్తించారు.
Also Read
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
అధికారులకు పట్టుబడిన తర్వాత.. తనను , ఇతర ఉగ్రవాద ఖైదీలను జైలు అధికారులు తీవ్రంగా కొట్టారని ఆడియోలో అజర్ చెప్పాడు. గొలుసులతో కొట్టడంతో పాటు ,రోజూ వారీ కార్యకలాపాలపై నిఘా ఉండేదని వెల్లడించారు. ఈ ఘటన తనను మానసికంగా పూర్తిగా కుంగదీసిందని, ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు తనను భయపెడతాయని చెప్పాడు.
ఐసీ-814 హైజాకింగ్ తర్వాత విడుదల:
1999లో ఖాట్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాకింగ్ సమయంలో భారత ప్రయాణికుల్ని కాపాడేందుకు అప్పటి వాజ్పేయి సర్కార్ మసూద్ అజర్ను విడుదల చేసింది. విడుదలైన తర్వాత జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. 2001లో భారత పార్లమెంట్పై దాడి, 2008 ముంబై టెర్రర్ దాడులకు ఇతనే ప్రధాన సూత్రధారి. ఈ ఏడాది పహల్గామ్ దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో మసూద్ అజార్ జైషే కార్యాలయాన్ని ధ్వంసం చేశాము. ఈ దాడిలో అజర్ కుటుంబంలో కనీసం 10 మంది మరణించారు. బహవల్పూర్లోని జైషే హెడ్ ఆఫీస్ తీవ్రంగా దెబ్బతింది.
తాజావార్తలు
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
-
Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!