Mansarovar Yatra: మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
- మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యతరం..
- ఘాటుగా స్పందించిన భారత్..
- లిపులేఖ్ మా ప్రాంతమంటూ నేపాల్ వాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mansarovar Yatra: ‘‘మానస సరోవర్ యాత్ర’’పై నేపాల్ అభ్యతరం చెబుతోంది. లిపులేఖ్ మీదుగా సాగే ఈ యాత్ర మార్గం నేపాల్ వ్యతిరేకించింది. భారత్, చైనాలకు దౌత్యపరమైన నిరసన తెలిపింది. ఈ పరిణామం తర్వాత భారత్ ఘాటుగా స్పందించింది. కాఠ్మాండు చేస్తున్న ప్రాదేశిక వాదనల్ని తోసిపుచ్చింది. “1954 నుండి కైలాస మానస సరోవర యాత్రకు లిపులేఖ్ కనుమ (Pass) ఒక దీర్ఘకాలిక మార్గంగా ఉంది. ఇది కొత్తగా వచ్చిన పరిణామం ఏమీ కాదు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ మే 3న పేర్కొంది. ఇలాంటి వాదనలు సమర్థనీయం కాదని, అలాగే చారిత్రక వాస్తవాలు, ఆధారాలపై నేపాల్ వాదనలు ఆధారపడి లేవని, నేపాల్ చేస్తున్న ప్రాదేశిక వాదనలు, కృత్తిమంగా విస్తరించుకునే ఇలాంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని భారత్ చెప్పింది. ఇదే సమయంలో చర్చలు, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని చెప్పింది.
లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ అనే మూడు ప్రాంతాలపై నేపాల్ తన ప్రాదేశిక వాదనల్ని చేస్తోంది. ఈ ప్రాంతాలు చారిత్రాత్మకంగా భారత్లో భాగంగా ఉన్నాయి. గతంలో నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి ఉన్న సమయంలో ఈ మూడు ప్రాంతాలను నేపాల్ తన మ్యాప్లో భాగంగా చూపించింది. ఆ సమయంలో భారత్ నుంచి తీవ్ర స్పందన వచ్చింది.
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
Read Also: Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
‘‘1816 సుగౌలి ఒప్పందం ప్రకారం, లింపియాధుర, లిపులేఖ్ మరియు కాలాపాని నేపాల్లో అంతర్భాగాలని నేపాల్ ప్రభుత్వం స్పష్టంగా మరియు దృఢంగా ఉంది’’ అని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ పౌడ్యాత్ ఛెత్రి మాట్లాడుతూ.. నేపాల్ తన ఆందోళనలను దౌత్య మార్గాల ద్వారా న్యూఢిల్లీ మరియు బీజింగ్ రెండింటికీ తెలియజేసిందని అన్నారు. రాజకీయ పార్టీలతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. లిపులేఖ్ నేపాల్ భూభాగమని చైనాకు తెలియజేసినట్లు చెప్పారు. ఈ వివాదాస్పద ప్రాంతంలో కార్యకలాపాలు నిలిపేయాలని అన్నారు.
ఈ వివాదాస్పద ప్రాంతంలో రహదారుల నిర్మాణం, విస్తరణ, సరిహద్దు వాణిజ్యం, తీర్థయాత్రలకు సంబంధించిన కార్యకలాపాలు చేపట్టవద్దని భారత్ను నేపాల్ కోరింది. ఇదే సమయంలో భారత్ నేపాల్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి నేపాల్ కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!