ముంబైలోని నటుడు షారూఖ్ ఖాన్ నివాసం మన్నత్ దీపావళికి ముందు దీపాలతో అలంకరించారు. దీనికి కారణం లేకపోలేదు. అతని కుటుంబం వేడుక చేసుకోవడానికి మరొక కారణం కూడా ఉంది. ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ విడుదలయ్యారు.
ఆర్యన్తో పాటు మరో ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అక్టోబర్ 2న ముంబైలోని ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుండి అరెస్టు చేసింది. డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో ఈ దాడి జరిగింది, అతను ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నాడు. దాదాపు మూడు వారాల జైలు జీవితం గడిపిన తర్వాత, ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 28న బాంబే హైకోర్టు షరతు లతో కూడిన బెయిల్పై విడుదలయ్యాడు. దీంతో మన్నత్లో దీపావ ళికి మూడు రోజుల ముందు నుంచే వేడుకలు చేసుకుంటుంది షారుఖ్ఖాన్ కుటుంబం.
