Manipur Congress Chief: మణిపూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి ఈడీ సమన్లు..
- మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ కు ఈడీ నోటీసులు..
- ఈడీ నోటీసులపై మండిపడిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి బుపెండా మెయిటీ..
- కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదు: బుపెండా మెయిటే
Manipur Congress Chief: మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్ల జారీ చేసింది. మణిపూర్ పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి ఎన్ బుపెండా మెయిటే మాట్లాడుతూ.. ఈడీ ప్రతీకార రాజకీయాలకు దిగుతుందని విమర్శించారు. కేంద్రంలో, మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్భయంగా ఆందోళనలు చేయడంలో మేఘచంద్ర కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. మే 2023 నుంచి రాష్ట్రంలో కొనసాగుతున్న గందరగోళాల మధ్య ఈ ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపుతూ మేఘచంద్ర ప్రజలకు బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారని బుపెండా మెయిటే పేర్కొన్నారు.
Read Also: Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివేనా? మరి ఏ రకమైన వాటిని తినడం మంచిది?
Also Read
ఇక, కాంగ్రెస్ నేతలపై ఈడీ పగ, వేధింపులు, ప్రతీకార రాజకీయాలకు దిగుతుందని మణిపూర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎన్ బుపెండా మెయిటే ఆరోపించారు. మణిపూర్లో తమ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.. సంక్షోభ సమయంలో రాష్ట్రాన్ని సందర్శించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నిరాకరించడాన్ని ఆయన గుర్తు చేశారు. ఈడీ, సీబీఐ కేసులతో కాంగ్రెస్ను భయపెట్టలేరు.. రాహుల్ గాంధీ నిర్భయమైన నాయకుడు.. ఈ ఈడీ సమన్లు మమ్మల్ని నిశ్శబ్దంగా ఉంచలేవన్నారు. తాము రాష్ట్ర, దేశ ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేస్తామన్నారు. డబుల్- ఇంజిన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని బుపెండా మెయిటీ విమర్శలు గుప్పించారు. మణిపూర్ పీసీసీ చీఫ్ మేఘచంద్ర ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన న్యూ ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అయితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు మేఘచంద్ర సింగ్ సోమవారం వెళ్లలేదు.
- Tags
- bjp
- CBI
- congress
- ED
- ED summons
తాజావార్తలు
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో