Manipur Congress Chief: మణిపూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి ఈడీ సమన్లు..
- మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ కు ఈడీ నోటీసులు..
- ఈడీ నోటీసులపై మండిపడిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి బుపెండా మెయిటీ..
- కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదు: బుపెండా మెయిటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Congress Chief: మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్ల జారీ చేసింది. మణిపూర్ పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి ఎన్ బుపెండా మెయిటే మాట్లాడుతూ.. ఈడీ ప్రతీకార రాజకీయాలకు దిగుతుందని విమర్శించారు. కేంద్రంలో, మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్భయంగా ఆందోళనలు చేయడంలో మేఘచంద్ర కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. మే 2023 నుంచి రాష్ట్రంలో కొనసాగుతున్న గందరగోళాల మధ్య ఈ ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపుతూ మేఘచంద్ర ప్రజలకు బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారని బుపెండా మెయిటే పేర్కొన్నారు.
Read Also: Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివేనా? మరి ఏ రకమైన వాటిని తినడం మంచిది?
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ఇక, కాంగ్రెస్ నేతలపై ఈడీ పగ, వేధింపులు, ప్రతీకార రాజకీయాలకు దిగుతుందని మణిపూర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎన్ బుపెండా మెయిటే ఆరోపించారు. మణిపూర్లో తమ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.. సంక్షోభ సమయంలో రాష్ట్రాన్ని సందర్శించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నిరాకరించడాన్ని ఆయన గుర్తు చేశారు. ఈడీ, సీబీఐ కేసులతో కాంగ్రెస్ను భయపెట్టలేరు.. రాహుల్ గాంధీ నిర్భయమైన నాయకుడు.. ఈ ఈడీ సమన్లు మమ్మల్ని నిశ్శబ్దంగా ఉంచలేవన్నారు. తాము రాష్ట్ర, దేశ ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేస్తామన్నారు. డబుల్- ఇంజిన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని బుపెండా మెయిటీ విమర్శలు గుప్పించారు. మణిపూర్ పీసీసీ చీఫ్ మేఘచంద్ర ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన న్యూ ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అయితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు మేఘచంద్ర సింగ్ సోమవారం వెళ్లలేదు.
- Tags
- bjp
- CBI
- congress
- ED
- ED summons
తాజావార్తలు
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
-
HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
-
OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. ‘రెడ్ జోన్’ వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!