ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జూనియర్ డాక్టర్ల చర్చలపై ప్రతిష్టంభన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని డాక్టర్లకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే షరతులతో కూడిన ఆహ్వానం పంపించింది. దీంతో వైద్యులు చర్చలకు వచ్చేందుకు నిరాకరించారు. ముఖ్యమంత్రి మమత మాత్రం సెమినార్ హాల్కు వచ్చేశారు. దాదాపు వైద్యుల కోసం 2 గంటల పాటు నిరీక్షించారు. కానీ ఎవరూ రాలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోను తృణమూల్ కాంగ్రెస్ పోస్టు చేసింది. అంతేకాకుండా మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘‘నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని పెద్ద ప్రకటన చేశారు. ఒక హాలులో ఒంటరిగా కూర్చుని జూనియర్ డాక్టర్ల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు.
Would you ever see a @BJP4India CM waiting 1.5 hours to engage in open dialogue with protestors? Absolutely not.
From JNU to the farmers’ protest, from wrestlers’ protest to Manipur – PM @narendramodi and BJP have consistently shown a disregard for democratic discussion and… pic.twitter.com/huTzNvbklG
— All India Trinamool Congress (@AITCofficial) September 12, 2024