పెగాసస్ దుమారం.. దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెగాసస్.. ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం ఇప్పుడు భారత్లో సంచలనంగా మారింది… ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండగా.. పార్లమెంట్ సమావేశాలను సైతం పెగాసస్ వ్యవహారం కుదిపేస్తోంది.. ఈ తరుణంలో.. సంచలన వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ప్రజాస్వామ్య భారత్ను మోడీ సర్కారు నిఘా దేశంగా తయారు చేయాలనుకుంటోందని దుయ్యబట్టిన ఆమె.. పెగాసస్కు భయపడి తన ఫోన్కు ప్లాస్టర్ వేసుకున్నానని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వ విపరీత చర్యలకు కూడా ప్లాస్టర్ వేయాల్సిందేనని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఇక, ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు దీదీ.
భారత్లో సంక్షేమం మానేసి బీజేపీ సర్కార్ నిఘా దేశంగా మార్చాలనుకుంటోందని ఫైర్ అయ్యారు మమతా బెనర్జీ.. అందుకే పెట్రోల్, డీజిల్, ఇతర వస్తు, సేవల ద్వారా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తోన్న సొమ్ముతో సంక్షేమ పథకాలు చేపట్టకుండా.. వ్యక్తులపై నిఘా పెట్టేందుకు.. ప్రమాదకరమైన సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసేందుకు వినియోగిస్తున్నారంటూ విమర్శించారు. ఇక, తన ఫోన్ను కూడా ట్యాపింగ్ చేస్తారని తెలుసు.. అందుకే ఎన్సీసీ అధినేత శరద్ పవార్, ఇతర ప్రతిపక్ష నేతలు, సీఎంలతో నేను ఫోన్లలో మాట్లాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు దీదీ.. పెగాసస్కు భయపడి నా ఫోన్కు ప్లాస్టర్ వేసుకున్నానని.. కానీ, హ్యాకింగ్ వంటివేవీ వారిని రక్షించలేవంటూ వార్నింగ్ ఇచ్చారు. రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి కూడా ప్లాస్టర్ వేయాలని పిలుపునిచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
-
CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?