పెగాసస్ దుమారం.. దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెగాసస్.. ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం ఇప్పుడు భారత్లో సంచలనంగా మారింది… ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండగా.. పార్లమెంట్ సమావేశాలను సైతం పెగాసస్ వ్యవహారం కుదిపేస్తోంది.. ఈ తరుణంలో.. సంచలన వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ప్రజాస్వామ్య భారత్ను మోడీ సర్కారు నిఘా దేశంగా తయారు చేయాలనుకుంటోందని దుయ్యబట్టిన ఆమె.. పెగాసస్కు భయపడి తన ఫోన్కు ప్లాస్టర్ వేసుకున్నానని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వ విపరీత చర్యలకు కూడా ప్లాస్టర్ వేయాల్సిందేనని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఇక, ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు దీదీ.
భారత్లో సంక్షేమం మానేసి బీజేపీ సర్కార్ నిఘా దేశంగా మార్చాలనుకుంటోందని ఫైర్ అయ్యారు మమతా బెనర్జీ.. అందుకే పెట్రోల్, డీజిల్, ఇతర వస్తు, సేవల ద్వారా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తోన్న సొమ్ముతో సంక్షేమ పథకాలు చేపట్టకుండా.. వ్యక్తులపై నిఘా పెట్టేందుకు.. ప్రమాదకరమైన సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసేందుకు వినియోగిస్తున్నారంటూ విమర్శించారు. ఇక, తన ఫోన్ను కూడా ట్యాపింగ్ చేస్తారని తెలుసు.. అందుకే ఎన్సీసీ అధినేత శరద్ పవార్, ఇతర ప్రతిపక్ష నేతలు, సీఎంలతో నేను ఫోన్లలో మాట్లాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు దీదీ.. పెగాసస్కు భయపడి నా ఫోన్కు ప్లాస్టర్ వేసుకున్నానని.. కానీ, హ్యాకింగ్ వంటివేవీ వారిని రక్షించలేవంటూ వార్నింగ్ ఇచ్చారు. రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి కూడా ప్లాస్టర్ వేయాలని పిలుపునిచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!