Maharashtra Political Crisis: నేడు ఏక్ నాథ్ షిండే బలనిరూపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం ఏక్ నాథ్ షిండే తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. స్పీకర్ ఎన్నిక, బలనిరూపణ కోసం మహారాష్ట్ర అసెంబ్లీ జూలై 3,4 తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చింది. కాగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరిగింది. ఈ రోజు ఏక నాథ్ షిండే బలనిరూపణ పరీక్ష జరగనుంది. దీంతో ఈ రోజుతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది.
షిండే ప్రభుత్వం సులభంగానే మెజారిటీని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. నిన్న స్పీకర్ ఎన్నిక సమయంలో షిండే, బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా 164 ఓట్లు లభించాయి. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాహుల నర్వేకర్ స్పీకర్ గా ఎన్నికయ్యాడు. ఈయనకు వ్యతిరేకంగా 107 ఓట్లు వచ్చాయి. స్పీకర్ ఎన్నికతో షిండే ప్రభుత్వానికి 160కి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 288 అయితే ఇందులో ఒక శాసన సభ్యుడు మరణించాడు. ప్రస్తుతం ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ 144. కాగా.. బీజేపీకి స్వతహాగా 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో పాటు శివసేనలో షిండే వర్గానికి 39 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో 17 మంది స్వతంత్రులు, ఎంఎన్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే మద్దతు ఉంది. దీంతో పాటు చిన్నాచితక పార్టీల మద్దతుతో 160కి ఫైగా ఎమ్మెల్యేలు షిండే, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
Read Also:Copenhagen: డెన్మార్క్ లో కాల్పులు.. ముగ్గురి మృతి
అనేక రాజకీయ ట్విస్టుల మధ్య సీఎం ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిష్టించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మహావికాస్ అఘాడీ కూటమికి వ్యతిరేకంగా శివసేనలో చీలిక తీసుకువచ్చి మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. గౌహతి, గోవా ఇలా క్యాంపుల్లో ఉంటూ రాజకీయం చేశారు. చివరకు బీజేపీ మద్దతుతో సీఎంగా షిండే ఎన్నికయ్యారు. బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!