Maharashtra Political Crisis: నేడు ఏక్ నాథ్ షిండే బలనిరూపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం ఏక్ నాథ్ షిండే తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. స్పీకర్ ఎన్నిక, బలనిరూపణ కోసం మహారాష్ట్ర అసెంబ్లీ జూలై 3,4 తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చింది. కాగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరిగింది. ఈ రోజు ఏక నాథ్ షిండే బలనిరూపణ పరీక్ష జరగనుంది. దీంతో ఈ రోజుతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది.
షిండే ప్రభుత్వం సులభంగానే మెజారిటీని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. నిన్న స్పీకర్ ఎన్నిక సమయంలో షిండే, బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా 164 ఓట్లు లభించాయి. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాహుల నర్వేకర్ స్పీకర్ గా ఎన్నికయ్యాడు. ఈయనకు వ్యతిరేకంగా 107 ఓట్లు వచ్చాయి. స్పీకర్ ఎన్నికతో షిండే ప్రభుత్వానికి 160కి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 288 అయితే ఇందులో ఒక శాసన సభ్యుడు మరణించాడు. ప్రస్తుతం ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ 144. కాగా.. బీజేపీకి స్వతహాగా 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో పాటు శివసేనలో షిండే వర్గానికి 39 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో 17 మంది స్వతంత్రులు, ఎంఎన్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే మద్దతు ఉంది. దీంతో పాటు చిన్నాచితక పార్టీల మద్దతుతో 160కి ఫైగా ఎమ్మెల్యేలు షిండే, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు.
Also Read
Read Also:Copenhagen: డెన్మార్క్ లో కాల్పులు.. ముగ్గురి మృతి
అనేక రాజకీయ ట్విస్టుల మధ్య సీఎం ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిష్టించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మహావికాస్ అఘాడీ కూటమికి వ్యతిరేకంగా శివసేనలో చీలిక తీసుకువచ్చి మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. గౌహతి, గోవా ఇలా క్యాంపుల్లో ఉంటూ రాజకీయం చేశారు. చివరకు బీజేపీ మద్దతుతో సీఎంగా షిండే ఎన్నికయ్యారు. బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేశారు.
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్ఎస్కు 78 సీట్లు ఖాయం
-
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్కు చోటు.. ఆ బ్యాటర్పై వేటు..
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
-
US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్పై అమెరికా దాడి…
-
Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!