Maharashtra Political Crisis: నేడు ఏక్ నాథ్ షిండే బలనిరూపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం ఏక్ నాథ్ షిండే తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. స్పీకర్ ఎన్నిక, బలనిరూపణ కోసం మహారాష్ట్ర అసెంబ్లీ జూలై 3,4 తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చింది. కాగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరిగింది. ఈ రోజు ఏక నాథ్ షిండే బలనిరూపణ పరీక్ష జరగనుంది. దీంతో ఈ రోజుతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది.
షిండే ప్రభుత్వం సులభంగానే మెజారిటీని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. నిన్న స్పీకర్ ఎన్నిక సమయంలో షిండే, బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా 164 ఓట్లు లభించాయి. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాహుల నర్వేకర్ స్పీకర్ గా ఎన్నికయ్యాడు. ఈయనకు వ్యతిరేకంగా 107 ఓట్లు వచ్చాయి. స్పీకర్ ఎన్నికతో షిండే ప్రభుత్వానికి 160కి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 288 అయితే ఇందులో ఒక శాసన సభ్యుడు మరణించాడు. ప్రస్తుతం ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ 144. కాగా.. బీజేపీకి స్వతహాగా 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో పాటు శివసేనలో షిండే వర్గానికి 39 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో 17 మంది స్వతంత్రులు, ఎంఎన్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే మద్దతు ఉంది. దీంతో పాటు చిన్నాచితక పార్టీల మద్దతుతో 160కి ఫైగా ఎమ్మెల్యేలు షిండే, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు.
Also Read
- DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
- JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
Read Also:Copenhagen: డెన్మార్క్ లో కాల్పులు.. ముగ్గురి మృతి
అనేక రాజకీయ ట్విస్టుల మధ్య సీఎం ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిష్టించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మహావికాస్ అఘాడీ కూటమికి వ్యతిరేకంగా శివసేనలో చీలిక తీసుకువచ్చి మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. గౌహతి, గోవా ఇలా క్యాంపుల్లో ఉంటూ రాజకీయం చేశారు. చివరకు బీజేపీ మద్దతుతో సీఎంగా షిండే ఎన్నికయ్యారు. బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేశారు.
తాజావార్తలు
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
-
Mega 158 : నేటి నుండి పొల్లాచ్చిలో మెగా 158.. ఏమి చేస్తున్నారంటే?
-
Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
-
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!