INDIA Bloc: మహారాష్ట్ర ఫలితాలపై కోర్టుకు వెళ్లే యోచనలో ప్రతిపక్షం!
- మహారాష్ట్ర ఫలితాలపై కోర్టుకు వెళ్లే యోచనలో ప్రతిపక్షం!
- న్యాయ నిపుణులతో మహా వికాస్ అఘాడీ చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి.. తిరిగి ఆరు నెలల తర్వాత ఇంత ఘోరంగా ఓడిపోవడంపై ఇండియా కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. 288 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం అంటే 49 స్థానాల్లోనే ఇండియా కూటమి గెలుచుకుంది. ఈ ఓటమిని ఏ మాత్రం తట్టుకోలేకపోతుంది. ఇప్పటికే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. తాజాగా దీనిపై న్యాయ పోరాటం చేయాలని మహా వికాస్ అఘాడీ నేతలు నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధపడుతోంది. ఈ మేరకు న్యాయ నిపుణులను కూటమి నేతలు కలిశారు. తిరిగి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలంటూ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Cyclone Alert for AP: ఏపీకి తుఫాన్ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత కూడా.. ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపించారు. అమెరికా తరహాలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. తాజాగా మహారాష్ట్రలో ఓడిపోయిన తర్వాత డిమాండ్ మళ్లీ తెరపైకి తెచ్చారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరిపించాలంటూ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Minister Seethakka: నిర్మల్ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 288 స్థానాలకు గాను 132 స్థానాలు గెలుచుకుంది. ఇన్ని సీట్లు గెలుచుకోవడానికి ఈవీఎంల హ్యాక్ చేయడం వల్లే సాధ్యమైందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నేపథ్యంలోనే ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీలు.. తిరిగి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆందోళనలు చేయాలని డిసైడ్ అవుతున్నారు.
తాజా ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, కాంగ్రెస్ 16, శరద్ పవార్ పార్టీ 10 స్థానాలు గెలుచుకున్నాయి. థాక్రే 95 స్థానాల్లో పోటీ చేస్తే 20 స్థానాలు, కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేస్తే 16 స్థానాలే గెలుచుకున్నాయి. ఇంత భారీగా ఓడిపోవడమేంటో అర్థం కావడం లేదని తర్జనభర్జన పడుతోంది.
ఇది కూడా చదవండి: Australia Cricket: క్రికెట్ మైదానంలో ఏడ్చేసిన సీన్ అబాట్.. కారణమిదే..?
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!