INDIA Bloc: మహారాష్ట్ర ఫలితాలపై కోర్టుకు వెళ్లే యోచనలో ప్రతిపక్షం!
- మహారాష్ట్ర ఫలితాలపై కోర్టుకు వెళ్లే యోచనలో ప్రతిపక్షం!
- న్యాయ నిపుణులతో మహా వికాస్ అఘాడీ చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి.. తిరిగి ఆరు నెలల తర్వాత ఇంత ఘోరంగా ఓడిపోవడంపై ఇండియా కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. 288 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం అంటే 49 స్థానాల్లోనే ఇండియా కూటమి గెలుచుకుంది. ఈ ఓటమిని ఏ మాత్రం తట్టుకోలేకపోతుంది. ఇప్పటికే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. తాజాగా దీనిపై న్యాయ పోరాటం చేయాలని మహా వికాస్ అఘాడీ నేతలు నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధపడుతోంది. ఈ మేరకు న్యాయ నిపుణులను కూటమి నేతలు కలిశారు. తిరిగి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలంటూ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Cyclone Alert for AP: ఏపీకి తుఫాన్ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత కూడా.. ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపించారు. అమెరికా తరహాలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. తాజాగా మహారాష్ట్రలో ఓడిపోయిన తర్వాత డిమాండ్ మళ్లీ తెరపైకి తెచ్చారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరిపించాలంటూ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Minister Seethakka: నిర్మల్ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 288 స్థానాలకు గాను 132 స్థానాలు గెలుచుకుంది. ఇన్ని సీట్లు గెలుచుకోవడానికి ఈవీఎంల హ్యాక్ చేయడం వల్లే సాధ్యమైందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నేపథ్యంలోనే ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీలు.. తిరిగి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆందోళనలు చేయాలని డిసైడ్ అవుతున్నారు.
తాజా ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, కాంగ్రెస్ 16, శరద్ పవార్ పార్టీ 10 స్థానాలు గెలుచుకున్నాయి. థాక్రే 95 స్థానాల్లో పోటీ చేస్తే 20 స్థానాలు, కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేస్తే 16 స్థానాలే గెలుచుకున్నాయి. ఇంత భారీగా ఓడిపోవడమేంటో అర్థం కావడం లేదని తర్జనభర్జన పడుతోంది.
ఇది కూడా చదవండి: Australia Cricket: క్రికెట్ మైదానంలో ఏడ్చేసిన సీన్ అబాట్.. కారణమిదే..?
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!