Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- నాయకుల శైలిలో మార్పులు
- ప్రజా రవాణాలో నాయకుల ప్రయాణాలు
- ఇండిగోలో బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఇచ్చిన పొదుపు మంత్రం పిలుపు నాయకుల జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చాయి. ముఖ్యమంత్రి అంటే సహజంగా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి. ఎక్కడికి వెళ్లాలన్న నిశ్చతంగా వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు దేశంలో పరిస్థితులు మారాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. దీంతో అన్ని దేశాలు కఠినంగా పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. ప్రస్తుతం భారత్లో కూడా అమలవుతోంది.
ఇందులో భాగంగానే ప్రధాని మోడీ దగ్గర నుంచి కింద స్థాయి నాయకులంతా కాన్వాయ్ల సంఖ్య తగ్గించేశారు. గురువారం బుల్లెట్పై సచివాలయానికి వెళ్లిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. తాజాగా సాధారణ విమాన ప్రయాణాన్ని ఎంచుకున్నారు. పుణె నుంచి బెంగళూరుకు ఇండిగో ఎయిర్లైన్స్ ఎకానమీ క్లాస్లో సాధారణ ప్రయాణికులతో కలిసి ముఖ్యమంత్రి ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణ చర్యలు అమలవుతున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు కూడా సాధారణ జీవనశైలిని అనుసరిస్తున్నారు.
Also Read
- Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
- West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ అయతుల్లా ఖమేనీ హతమయ్యారు. అనేక మంది ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు వెళ్లే నౌకలు నిలిచిపోయాయి. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తుండగా.. ప్రస్తుతం భారత్లో అమలవుతోంది.
Maharashtra CM Devendra Fadnavis travels from Pune to Bengaluru by an economy flight of IndiGo Airlines, in line with PM Modi's appeal amid the West Asia Conflict. pic.twitter.com/DerUjeJXc7
— ANI (@ANI) May 15, 2026
తాజావార్తలు
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!