Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- నాయకుల శైలిలో మార్పులు
- ప్రజా రవాణాలో నాయకుల ప్రయాణాలు
- ఇండిగోలో బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఇచ్చిన పొదుపు మంత్రం పిలుపు నాయకుల జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చాయి. ముఖ్యమంత్రి అంటే సహజంగా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి. ఎక్కడికి వెళ్లాలన్న నిశ్చతంగా వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు దేశంలో పరిస్థితులు మారాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. దీంతో అన్ని దేశాలు కఠినంగా పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. ప్రస్తుతం భారత్లో కూడా అమలవుతోంది.

Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
ఇందులో భాగంగానే ప్రధాని మోడీ దగ్గర నుంచి కింద స్థాయి నాయకులంతా కాన్వాయ్ల సంఖ్య తగ్గించేశారు. గురువారం బుల్లెట్పై సచివాలయానికి వెళ్లిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. తాజాగా సాధారణ విమాన ప్రయాణాన్ని ఎంచుకున్నారు. పుణె నుంచి బెంగళూరుకు ఇండిగో ఎయిర్లైన్స్ ఎకానమీ క్లాస్లో సాధారణ ప్రయాణికులతో కలిసి ముఖ్యమంత్రి ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణ చర్యలు అమలవుతున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు కూడా సాధారణ జీవనశైలిని అనుసరిస్తున్నారు.
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ అయతుల్లా ఖమేనీ హతమయ్యారు. అనేక మంది ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు వెళ్లే నౌకలు నిలిచిపోయాయి. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తుండగా.. ప్రస్తుతం భారత్లో అమలవుతోంది.
Maharashtra CM Devendra Fadnavis travels from Pune to Bengaluru by an economy flight of IndiGo Airlines, in line with PM Modi's appeal amid the West Asia Conflict. pic.twitter.com/DerUjeJXc7
— ANI (@ANI) May 15, 2026
తాజావార్తలు
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!