High Court: పోలీసులపై సంచలన వ్యాఖ్యలు.. 90 శాతం అవినీతిపరులే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసింది మద్రాస్ హైకోర్టు.. ప్రస్తుతం పోలీసు డిపార్ట్మెంట్లో 90 శాతం మంది అవినీతిపరులు ఉన్నారని.. 90 మంది అసమర్థులైన అధికారులతో పనిచేస్తున్నారని పేర్కొంది.. కనీసం కేసుల విచారణ సక్రమంగా నిర్వహించలేకపోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. పోలీసు శాఖలో కేవలం 10 శాతం మంది సిబ్బంది మాత్రమే నిజాయితీగా, సమర్థతతో ఉన్నారని.. అన్ని కేసుల్లోనూ విచారణ జరుపుతారని ఆ కొద్ది శాతం అధికారుల నుంచి ఆశించలేమని తేల్చి చెప్పింది.. అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించారని.. నేర పరిశోధన విధానాలపై అవగాహన లేని అధికారులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు జస్టిస్ పి.వేల్మురుగన్..
Read Also: TS SSC Exams: షెడ్యూల్ విడుదల.. 11 నుంచి పరీక్షలు
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ చీటింగ్ కేసును సక్రమంగా విచారించలేదంటూ మహిళా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్పై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.. ఫైళ్లను పరిశీలించిన న్యాయమూర్తి.. 2011లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదైందని నిర్ధారించారు. దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు 2014లో కేసును తప్పుబట్టారు. అయితే, ఫిర్యాదుదారు నిరసన పిటిషన్ను దాఖలు చేసి, తాజా దర్యాప్తు కోసం ఆదేశాల కోసం 2021లో హైకోర్టును ఆశ్రయించారు. అయితే, మరోసారి, ప్రస్తుత ధిక్కార పిటిషన్ను తరలించవలసిందిగా ఫిర్యాదుదారుడు చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.. ప్రభుత్వ న్యాయవాది ఎస్.సుగేంద్రన్ కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరువర్గాల మధ్య వివాదం సివిల్ స్వభావంతో కూడుకున్నదని, పోలీసులు కేసును మూసివేయాలని ఎంచుకున్నారని తెలిపారు.. రికార్డ్ చూసిన తర్వాత, ఇన్స్పెక్టర్ కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు కనిపించడం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ కేసులో కీలకమైన సాక్షిని పోలీసులు విచారించి ఉంటే మొత్తం నిజం బయటపడేదని ఆయన సూచించారు. కానీ, సాక్షి చనిపోయే వరకు పోలీసులు అలా చేయలేదన్నారు. అందువల్ల, దర్యాప్తులో లోపాలను బట్టి సంబంధిత పోలీసు అధికారులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు పిటిషనర్కు స్వేచ్ఛను ఇచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!