Madhya Pradesh: మధ్యప్రదేశ్ “సీరియల్ కిల్లర్” అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Arrested Over Madhya Pradesh Serial Killings: మధ్యప్రదేశ్ సాగర్ పట్టణాన్ని వణికిస్తున్న సీరియల్ కిల్లర్ ను పట్టుబడ్డట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ గార్డుల వరస హత్యలతో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతనే సీరియల్ కిల్లర్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఈ వారం సాగర్ పట్టణంలో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు వరసగా హత్యకు గురయ్యారు. పడుకుంటున్న సమయంలో తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు కిల్లర్. తాజాగా అనుమానిత వ్యక్తి భోపాల్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భోపాల్ లో కూడ ఇదే విధంగా ఒక సెక్యూరిటీ గార్డును కొట్టి చంపాడని పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందుతుడిని శివ ప్రసాద్(19)గా గుర్తించారు. మార్బుల్ రాయితో కొట్టి సెక్యూరిటీ గార్డులను హత్య చేశాడని ఖజూరీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సంధ్యా మిశ్రా వెల్లడించారు. సాగర్ లో జరిగిన వరస హత్యలకు ఇతనే కారణం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో శివ ప్రసాద్ ని అరెస్ట్ చేశామని ఐజీ అనురాగ్ తెలిపారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Harish Rao: నిర్మలా సీతారామన్కు హరీష్ రావ్ సవాల్.. నేను రాజీనామా చేస్తా.. మీరు చేస్తారా?
సాగర్ పట్టణంలో వరసగా మూడు రోజుల్లో రాత్రి పూట సెక్యూరిటీ గార్డులు దారుణంగా హత్యకు గురయ్యారు. వారందరూ రాయితో కొట్టడం వల్ల తలపగిలి చనిపోయారు. సాగర్ పట్టణంలో సోమవారం రాత్రి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 60 ఏళ్ల శంబురామ్ దూబే క్యాంటీన్ సమీపంలో హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఇలాగే మరో దాడి జరిగింది. మంగళ్ అహిర్వార్ అనే సెక్యూరిటీ గార్డును తలపై కొట్టి చంపాడు దుండగులు. మే నెలలో ఇలాగే మక్రోనియా బండ రోడ్డు ఏరియిలో నిర్మాణ స్థలంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న ఉత్తమ్ రజక్ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వారి దగ్గర నుంచి ఎలాంటి దోపిడి జరగలేదు. దీంతో సీరియల్ కిల్లర్ కావాలనే ఈ పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానించారు.
నిందితుడి ఆచూకీ కోసం పోలీసుల ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. ఇందులో తెల్లటి చొక్కా, షార్ట్ ధరించిన వ్యక్తిని గుర్తించారు. సీరియల్ కిల్లర్ కు సంబంధించిన స్కెచ్ ను కూడా వేయించారు పోలీసులు. ఆచూకీ తెలిపిన వారికి రూ. 20,000 బహుమతి ప్రకటించారు. తాజాగా సీరియల్ కిల్లర్ గా అనుమానిస్తున్న సోనూ వర్మను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!