Madhya Pradesh: మధ్యప్రదేశ్ “సీరియల్ కిల్లర్” అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Arrested Over Madhya Pradesh Serial Killings: మధ్యప్రదేశ్ సాగర్ పట్టణాన్ని వణికిస్తున్న సీరియల్ కిల్లర్ ను పట్టుబడ్డట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ గార్డుల వరస హత్యలతో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతనే సీరియల్ కిల్లర్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఈ వారం సాగర్ పట్టణంలో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు వరసగా హత్యకు గురయ్యారు. పడుకుంటున్న సమయంలో తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు కిల్లర్. తాజాగా అనుమానిత వ్యక్తి భోపాల్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భోపాల్ లో కూడ ఇదే విధంగా ఒక సెక్యూరిటీ గార్డును కొట్టి చంపాడని పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందుతుడిని శివ ప్రసాద్(19)గా గుర్తించారు. మార్బుల్ రాయితో కొట్టి సెక్యూరిటీ గార్డులను హత్య చేశాడని ఖజూరీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సంధ్యా మిశ్రా వెల్లడించారు. సాగర్ లో జరిగిన వరస హత్యలకు ఇతనే కారణం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో శివ ప్రసాద్ ని అరెస్ట్ చేశామని ఐజీ అనురాగ్ తెలిపారు.
Also Read
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
Read Also: Harish Rao: నిర్మలా సీతారామన్కు హరీష్ రావ్ సవాల్.. నేను రాజీనామా చేస్తా.. మీరు చేస్తారా?
సాగర్ పట్టణంలో వరసగా మూడు రోజుల్లో రాత్రి పూట సెక్యూరిటీ గార్డులు దారుణంగా హత్యకు గురయ్యారు. వారందరూ రాయితో కొట్టడం వల్ల తలపగిలి చనిపోయారు. సాగర్ పట్టణంలో సోమవారం రాత్రి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 60 ఏళ్ల శంబురామ్ దూబే క్యాంటీన్ సమీపంలో హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఇలాగే మరో దాడి జరిగింది. మంగళ్ అహిర్వార్ అనే సెక్యూరిటీ గార్డును తలపై కొట్టి చంపాడు దుండగులు. మే నెలలో ఇలాగే మక్రోనియా బండ రోడ్డు ఏరియిలో నిర్మాణ స్థలంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న ఉత్తమ్ రజక్ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వారి దగ్గర నుంచి ఎలాంటి దోపిడి జరగలేదు. దీంతో సీరియల్ కిల్లర్ కావాలనే ఈ పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానించారు.
నిందితుడి ఆచూకీ కోసం పోలీసుల ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. ఇందులో తెల్లటి చొక్కా, షార్ట్ ధరించిన వ్యక్తిని గుర్తించారు. సీరియల్ కిల్లర్ కు సంబంధించిన స్కెచ్ ను కూడా వేయించారు పోలీసులు. ఆచూకీ తెలిపిన వారికి రూ. 20,000 బహుమతి ప్రకటించారు. తాజాగా సీరియల్ కిల్లర్ గా అనుమానిస్తున్న సోనూ వర్మను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!