Cough syrup: దగ్గుమందు మరణాలు.. తమిళనాడు సహకరించడం లేదన్న మధ్యప్రదేశ్ సీఎం..
- దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్డ్రిఫ్ దగ్గుమందు మరణాలు..
- విచారణకు తమిళనాడు సహకరించడం లేదని ఎంపీ సీఎం ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cough syrup: ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు 21 మంది చిన్నారులను బలి తీసుకుంది. ఆరోగ్యాన్ని నయం చేయాల్సిన మందు, పిల్లల ప్రాణాలను తీసింది. కోల్డ్రిఫ్ దగ్గు మందు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరణాల నేపథ్యంలో మధ్యప్రదేశ్తో సహా పలు రాష్ట్రాలు ఈ మందును నిషేధించాయి. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణకు తమిళనాడు ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. గురువారం, నాగ్పూర్లో సిరప్ తాగి చికిత్స పొందుతున్న పిల్లల్ని ఆయన పరామర్శించారు.
Read Also: Ancient Temple Turkey: ముస్లిం దేశంలో బయట పడిన దేవాలయం.. ఎన్నివేల సంవత్సరాల నాటిది అంటే!
Also Read
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
- IMD Alert: 17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
- Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
నాగ్పూర్లో మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం విచారణకు సహకరించడం లేదని అన్నారు. తమిళనాడు ఔషధ నియంత్రణ సంస్థ అక్కడ లభించే ప్రామాణికం కాని ఔషధాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వివరణాత్మక నివేదికను సమర్పించాల్సి ఉందని ఆయన అన్నారు.
అయితే, సీఎం వ్యాఖ్యల్ని తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రమాదకర డైథిలిన్ గ్లైకాల్ కనుగొనబడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని నిషేధం జారీ చేసిందని తమిళనాడు ఆరోగ్య మంత్రి మా. సుబ్రమణియన్ అన్నారు. దీనిని మధ్యప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలతో పంచుకున్నామని చెప్పారు. మొదట్లో డ్రగ్ను పరిశీలించి ఎలాంటి తప్పు లేదని మధ్యప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు నివేదించాయని మంత్రి చెప్పారు. గత రెండేళ్లుగా సరైన తనిఖీలు నిర్వహించనందుకు ఇద్దరు సీనియర్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని తమిళనాడు మంత్రి అభ్యర్థించారు.
తాజావార్తలు
-
Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
-
CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్కు బిగ్ ప్లాన్.. ప్రత్యేక బ్యూరో ఏర్పాటు!
-
Prabhas: ప్రభాస్ ఇటలీ విల్లా రెంట్ ఎంతో చెప్పిన ప్రభాస్ శ్రీను!
-
Prabhas Srinu: “నా ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.10 వేలు.. అత్యధికంగా రెండు రోజులకు రూ.3 లక్షలు అందుకున్నా”
-
Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ లాంచ్.. కొత్త ఇంజన్, 5- స్టార్ సేఫ్టీ, ధర రూ. 7.39 లక్షల నుంచి స్టార్ట్..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!