NTV Telugu Site icon

Delhi: ఆల్‌పార్టీ నేతలతో స్పీకర్ భేటీ.. మోడీ, రాహుల్ హాజరు

Ombirla

Ombirla

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. వాస్తవానికి సభలు ఆగస్టు 12 వరకు జరగాల్సి ఉండగా.. మూడు రోజుల ముందుగానే సమావేశాలు ముగిశాయి. ఇదిలా ఉంటే సెషన్స్ వాయిదా పడగానే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. అన్ని పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, తదితర కేంద్రమంత్రులు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నుంచి ఫ్లోర్‌ లీటర్లు హాజరయ్యారు.