LOK Sabha-Elections 2024 : ఐదో విడత లోక్ సభ ఎన్నికలకు నేడు పోలింగ్ షురూ అయ్యింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు పోలింగ్ నిర్వహణ జరుగుతుంది. ఐదో విడతల 659 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు ఒడిశా అసెంబ్లీలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా ఏకకాలంలో ఓటింగ్ జరగనుంది. ఈ దశలో ఓటింగ్ జరగనున్న 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు – బీహార్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో ఓటింగ్ను నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు కొనసాగనుంది. ఐదో దశలో ఉత్తరప్రదేశ్లోని 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, లడఖ్, జమ్మూకాశ్మీర్లో ఒక్కో స్థానానికి పోలింగ్ షురూ అయ్యింది.