NTV Telugu Site icon

Laluprasad Yadav: ఐసీయూలో లాలూ.. ‘నాన్మ మీరే నా హీరో’ అంటూ రోహిణి భావోద్వేగ పోస్ట్..

Lalu Prasad Yadav

Lalu Prasad Yadav

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రెండు రోజుల క్రితం మెట్లపై నుంచి జారీపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఆయన వీపుకు గాయమయింది. భుజం విరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పాట్నాలోని పారస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లాలూ ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండ మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య తండ్రి ఆరోగ్య పరిస్థితి పట్ల భావోద్వేగానికి గురయ్యారు. ట్విటర్ వేదికగా లాలూ చికిత్స పొందుతున్న ఫొటోలను షేర్ చేస్తూ.. నువ్వే నా హీరో నాన్న అంటూ తన ప్రేమను చాటుకున్నారు.

Hyderabad Crime: సర్పదోషం పేరుతో 37 లక్షలు వసూళ్ళు.. ఫేక్ బాబాకు సంకెళ్ళు

తన తండ్రి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ‘నాన్నే నా హీరో. నా బ్యాక్ బోన్. త్వరగా కోలుకో నాన్నా. ప్రతి అవరోధం నుంచి విముక్తి పొందిన ఆయన వెంట ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. వారి అభిమానమే ఆయన బలం’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం రోహిణి ఆచార్య సింగపూర్ ఉంటున్నారు. అక్కడి నుంచి వీడియో కాల్ ద్వారా తండ్రి బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. మరోవైపు ఈరోజు ఆర్జేడీ 26వ వ్యవస్థాపక దినోత్సవం. అయితే, తమ అధినేత లాలూ ఆసుపత్రిలో ఉండటంతో వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. ఇంకోవైపు, తన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ కు లాలూ పార్టీ పగ్గాలను అప్పగించే అవకాశాలున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.